వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో విపక్ష కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. ఇప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే దిశగా టీడీపీ మొదలుపెట్టిన చర్యలు వైసీపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు. టీడీపీ చర్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ తన జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించినట్లుగా సమాచారం. ఇలా జగన్ సొంత జిల్లాలో జగన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను వేరే రాష్ట్రంలోని శిబిరానికి తరలించారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా… కడప జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు ఉంటే.. వాటిలో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. నాడు విపక్షంలో ఉన్న టీడీపీకి సింగిల్ సీటు మాత్రమే దక్కింది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకేసారి నలుగురు జడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఫలితంగా టీడీపీ బలం 5కు చేరింది. వైసీపీ బలం 45కు తగ్గింది. ఇక ఎన్నికల్లో జిల్లాలో రెండు సీట్లు మినహా మిగిలిన ఎమ్మెల్యే సీట్లన్నీ కూటమి పార్టీలే గెలిచాయి. ఫలితంగా జడ్పీ చైర్మన్ ఎన్నికలో కీలకంగా పరిగణిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య కూడా వైసీపీకి భారీగా తగ్గిపోగా… టీడీపీకి అనూహ్యంగా పెరిగింది.
అదే సమయంలో మొన్నటి ఎన్నికల దాకా కడప జడ్పీ చైర్మన్ గా కొనసాగిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఎన్నికల్లో రాంజేపట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కడప జడ్పీ చైర్మన్ గా కొత్తగా నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనుకోకుండా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ వ్యూహం రచించింది. అందులో భాగంగా తమ వైపు చూస్తున్న వైసీపీ జడ్పీటీసీలతో చర్చలు జరిపింది. వారిలో చాలా మంది పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలోగా జడ్పీటీసీల్లో చాలా మంది పార్టీ మారడం ఖాయమైపోయింది.
ఈ విషయం తెలిసినంతనే అప్రమత్తమైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వైసీపీ జడ్పీటీసీలను బెంగళూరు క్యాంప్ కు తరలించినట్లు సమాచారం. అయితే జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో వారిని అవినాశ్ ఎలా కాపాడుకుంటారోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ వైసీపీ జడ్పీటీసీలతో టీడీపీ చర్చలు పూర్తి అయిపోయాయని.., ఇలాంటి నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను అవినాశ్ బెంగళూరు క్యాంప్ నకు తరలించినా పెద్దగా ఫలితం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన జగన్ గడపపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమేనని చెప్పక తప్పదు.
This post was last modified on March 24, 2025 2:22 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…