వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో విపక్ష కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. ఇప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే దిశగా టీడీపీ మొదలుపెట్టిన చర్యలు వైసీపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు. టీడీపీ చర్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ తన జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించినట్లుగా సమాచారం. ఇలా జగన్ సొంత జిల్లాలో జగన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను వేరే రాష్ట్రంలోని శిబిరానికి తరలించారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా… కడప జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు ఉంటే.. వాటిలో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. నాడు విపక్షంలో ఉన్న టీడీపీకి సింగిల్ సీటు మాత్రమే దక్కింది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకేసారి నలుగురు జడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఫలితంగా టీడీపీ బలం 5కు చేరింది. వైసీపీ బలం 45కు తగ్గింది. ఇక ఎన్నికల్లో జిల్లాలో రెండు సీట్లు మినహా మిగిలిన ఎమ్మెల్యే సీట్లన్నీ కూటమి పార్టీలే గెలిచాయి. ఫలితంగా జడ్పీ చైర్మన్ ఎన్నికలో కీలకంగా పరిగణిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య కూడా వైసీపీకి భారీగా తగ్గిపోగా… టీడీపీకి అనూహ్యంగా పెరిగింది.
అదే సమయంలో మొన్నటి ఎన్నికల దాకా కడప జడ్పీ చైర్మన్ గా కొనసాగిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఎన్నికల్లో రాంజేపట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కడప జడ్పీ చైర్మన్ గా కొత్తగా నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనుకోకుండా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ వ్యూహం రచించింది. అందులో భాగంగా తమ వైపు చూస్తున్న వైసీపీ జడ్పీటీసీలతో చర్చలు జరిపింది. వారిలో చాలా మంది పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలోగా జడ్పీటీసీల్లో చాలా మంది పార్టీ మారడం ఖాయమైపోయింది.
ఈ విషయం తెలిసినంతనే అప్రమత్తమైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వైసీపీ జడ్పీటీసీలను బెంగళూరు క్యాంప్ కు తరలించినట్లు సమాచారం. అయితే జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో వారిని అవినాశ్ ఎలా కాపాడుకుంటారోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ వైసీపీ జడ్పీటీసీలతో టీడీపీ చర్చలు పూర్తి అయిపోయాయని.., ఇలాంటి నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను అవినాశ్ బెంగళూరు క్యాంప్ నకు తరలించినా పెద్దగా ఫలితం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన జగన్ గడపపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమేనని చెప్పక తప్పదు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…