Political News

అనుకున్నట్టుగానే.. ఒకే బాటలో రేవంత్, కేటీఆర్

దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంలో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావులు అనుకున్నట్లుగానే ఒకే బాటలో సాగారు. రాజకీయంగా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టేశారు. దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ ను ఒకరు వినిపిస్తే… మరొకరు దానికి దన్నుగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ… అవసరం అయితే కలిసి పనిచేసేందుకు కూడా తాము వెనుకాడబోమని కూడా వారు తేల్చి చెప్పారు. ఈ అరుదైన ఘట్టానికి తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ పై జరిగిన భేటీ వేదికగా నిలిచింది.

జనాభా ప్రాతిపదికగా జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ సర్కారు చేపట్టే ఈ డీలిమిటేషన్ తో దేశంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగదని, దేశంలో విభేదాలకు ఆజ్యం పోసినట్టు అవుతుందని, ప్రత్యేకించి దక్షిణాదికి జాతీయ స్థాయిలో అసలు విలువే లేకుండా పోతుందన్నది స్టాలిన్ వాదన. ఈ వాదనకు బలం చేకూర్చే దిశగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో కీలక బేటీని ఆయన శనివారం చెన్నైలో నిర్వహించారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా హాజరైంది. ఈ రెండు పక్షాల తరఫున రేవంత్ రెడ్డి, కేటీఆర్ హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

అంతా అనుకున్నట్లుగానే స్టాలిన్ వాదనకు వత్తాసు పలికిన రేవంత్, కేటీఆర్ లు బేటీలోనూ ఒకే బాట, ఒకే మాటగా సాగారు. బేటీలో భాగంగా తొలుత రేవంత్ రెడ్డి తన వాదనను వినిపించారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలు 33 శాతాన్ని అందిస్తున్నాయని… అలాంటప్పుడు అంతే స్థాయిలో నిధులను ఎందుకు దక్షిణాదికి విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రసంగించిన కేటీఆర్… రేవంత్ వాదనను సమర్థించారు. అది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన నూటికి నూరు పాళ్లు సరైనదేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జీడీపీలో 33 శాతం ఇస్తున్న దక్షిణాదికి 36 శాతం లోక్ సభ సీట్టు ఎందుకు ఇవ్వకూడదు అని ఆయన మరో ఆసక్తికర వాదనకు తెర తీశారు.

This post was last modified on March 23, 2025 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago