Political News

‘హత్య’ మూవీ నిర్మాతదర్శకుడిపై వివేకా హత్య కేసులో ఏ2 కేసు

ఇటీవల కాలంలో ఏపీలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. పులివెందుల వైసీపీకి వీర విధేయుడిగా.. దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా ఆయన తీరు ఉంది. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారాన్ని బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

‘హత్య’ మూవీలో తనను.. తన తల్లిని అవమానించేలా సన్నివేశాల్ని ఉంచటంపై సునీల్ యాదవ్ రగిలిపోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే హత్య చిత్ర దర్శక నిర్మాతతో పాటు.. రచయితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై కడప జిల్లా ఎస్పీని కలిసి.. కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వారిపై కేసు నమోదైంది.

వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూపులో ఈ చిత్రంలోని సన్నివేశాలను పోస్టు చేసి.. వైరల్ చేస్తున్నట్లుగా తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తన కుటుంబం కోసం 39 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని.. ఆ సమయంలోనే తన తండ్రిని కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. తన వారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే వారి బండారాన్ని బయటపెడతానని చెబుతున్న ఆయన.. మాటలతో పులివెందుల వైసీపీ వర్గాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

సునీల్ యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ కేసుగా మారటమే కాదు.. తదనంతర పరిణామాలు చాలా వేగంగా కదులుతున్నాయి. సునీల్ ఫిర్యాదులో పేర్కొన్న వాట్సప్ గ్రూపు ఆడ్మిన్ గా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ ను ఈ కేసులో ఏ1గా పేర్కొన్నారు. వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ ఆడ్మిన్ ను ఏ2గా చేర్చారు. వీరితో పాటు మరికొందరిని కూడా నిందితులుగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని.. కడప సైబర్ క్రైమ్ స్టేషన్ లో విచారించటమే కాదు.. పులివెందులకు తరలించారు. పవన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

This post was last modified on March 23, 2025 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

9 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago