ఇటీవల కాలంలో ఏపీలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. పులివెందుల వైసీపీకి వీర విధేయుడిగా.. దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా ఆయన తీరు ఉంది. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారాన్ని బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘హత్య’ మూవీలో తనను.. తన తల్లిని అవమానించేలా సన్నివేశాల్ని ఉంచటంపై సునీల్ యాదవ్ రగిలిపోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే హత్య చిత్ర దర్శక నిర్మాతతో పాటు.. రచయితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై కడప జిల్లా ఎస్పీని కలిసి.. కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వారిపై కేసు నమోదైంది.
వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూపులో ఈ చిత్రంలోని సన్నివేశాలను పోస్టు చేసి.. వైరల్ చేస్తున్నట్లుగా తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తన కుటుంబం కోసం 39 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని.. ఆ సమయంలోనే తన తండ్రిని కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. తన వారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే వారి బండారాన్ని బయటపెడతానని చెబుతున్న ఆయన.. మాటలతో పులివెందుల వైసీపీ వర్గాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
సునీల్ యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ కేసుగా మారటమే కాదు.. తదనంతర పరిణామాలు చాలా వేగంగా కదులుతున్నాయి. సునీల్ ఫిర్యాదులో పేర్కొన్న వాట్సప్ గ్రూపు ఆడ్మిన్ గా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ ను ఈ కేసులో ఏ1గా పేర్కొన్నారు. వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ ఆడ్మిన్ ను ఏ2గా చేర్చారు. వీరితో పాటు మరికొందరిని కూడా నిందితులుగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని.. కడప సైబర్ క్రైమ్ స్టేషన్ లో విచారించటమే కాదు.. పులివెందులకు తరలించారు. పవన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
This post was last modified on March 23, 2025 11:15 am
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…
కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…