ఇటీవల కాలంలో ఏపీలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. పులివెందుల వైసీపీకి వీర విధేయుడిగా.. దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా ఆయన తీరు ఉంది. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారాన్ని బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘హత్య’ మూవీలో తనను.. తన తల్లిని అవమానించేలా సన్నివేశాల్ని ఉంచటంపై సునీల్ యాదవ్ రగిలిపోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే హత్య చిత్ర దర్శక నిర్మాతతో పాటు.. రచయితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై కడప జిల్లా ఎస్పీని కలిసి.. కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వారిపై కేసు నమోదైంది.
వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూపులో ఈ చిత్రంలోని సన్నివేశాలను పోస్టు చేసి.. వైరల్ చేస్తున్నట్లుగా తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తన కుటుంబం కోసం 39 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని.. ఆ సమయంలోనే తన తండ్రిని కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. తన వారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే వారి బండారాన్ని బయటపెడతానని చెబుతున్న ఆయన.. మాటలతో పులివెందుల వైసీపీ వర్గాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
సునీల్ యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ కేసుగా మారటమే కాదు.. తదనంతర పరిణామాలు చాలా వేగంగా కదులుతున్నాయి. సునీల్ ఫిర్యాదులో పేర్కొన్న వాట్సప్ గ్రూపు ఆడ్మిన్ గా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ ను ఈ కేసులో ఏ1గా పేర్కొన్నారు. వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ ఆడ్మిన్ ను ఏ2గా చేర్చారు. వీరితో పాటు మరికొందరిని కూడా నిందితులుగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని.. కడప సైబర్ క్రైమ్ స్టేషన్ లో విచారించటమే కాదు.. పులివెందులకు తరలించారు. పవన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
This post was last modified on March 23, 2025 11:15 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…