Political News

రూ.2 కోట్లు లాగిన రజినీ… ఏసీబీ కేసు నమోదు

వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు అయ్యింది. ఎలాంటి తప్పు చేయని ఓ కంపెనీని కేవలం వసూళ్ల కోసం టార్గెట్ చేసిన రజినీ… దాని యాజమానుల నుంచి ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూళ్లను బలవంతంగా లాక్కున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రజినీ పాత్రను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నిర్ధారించగా… తాజాగా ఏసీబీ కూడా ఆమె పాత్రను నిర్ధారించి కేసు నమోదు చేసింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ ను టార్గెట్ చేసిన రజినీ అండ్ కో.. దాని యజమానుల నుంచి రూ.5 కోట్ల వసూలుకు యత్నించింది. కంపెనీలో అక్రమాలు జరిగాయో, లేదో తెలియదు గానీ…తన నియోకజవర్గ పరిధిలో వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందేనని రజినీ కంపెనీ యజమానులకు తేల్చి చెప్పారు. అందుకు కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోవడంతో వెంటనే సదరు కంపెనీపై విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ హోదాలో ఐపీఎస్ అదికారి పల్లె జాషువా తన సిబ్బందితో కలిసి పాలుపంచుకున్నారు.

ఈ దాడులకు కూడా కంపెనీ యాజమాన్యం బెదిరకపోగా… జాషువా నేరుగా కంపెనీ యజమానులకు ఫోన్ చేసి రజినీ చెప్పినట్లు వినకపోతే… రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… వారు రజినీ కలిశారు. ఆమె సూచన మేరకు రజినీ పీఏను కలిశారు. చర్చల్లో భాగంగా రూ.5 కోట్లకు బదులుగా రూ.2.20 కోట్లకు ఇరువర్గాలు అంగీకరించాయి. ఇందులో రూ.2 కోట్లను రజినీకి చెల్లించే విధంగా ఆ మొత్తాన్ని రజినీ మరిది గోపి చేతిలో పెట్టారు. ఆ తర్వాత గోపికి రూ.10 లక్షలు, జాషువాకు రూ.10 లక్షలు సమర్పించుకున్నారు.

ఇదిలా ఉంటే… నాడు ఈ వసూళ్లకు సంబంధించి జాషువా…రజినీ చేతిలో ఆయుధంగా పనిచేశారు. రజినీ చెప్పినట్లుగా నడుచుకున్నారు. రజీని ఏం చేయమంటే అదే చేశారు. తాను ఓ ఐపీఎస్ అధికారిని అని, విజిలెన్స్ శాఖలో కీలకంగా పని చేస్తున్నానన్న విషయాన్నే ఆయన మరిచిపోయారు. విజిలెన్స్ శాఖ దాడులు చేస్తే… ఆ సమాచారాన్ని ముందుగా ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. దాడుల తర్వాత నివేదికనూ పంపుతారు. అయితే ఈ వ్యవహారంలో మాత్రం ఈ రెండు పనులను జాషువా ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ఈ కారణంగానే ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసులో ఏ1గా రజినీ, ఏ2గా జాషువా, ఏ3గా గోపి, ఏ4గా రజినీ పీఏ రామకృష్ణ పేర్లను చేర్చారు.

Satya

Recent Posts

సూపర్ సుబ్బు సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది?

సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ మొదటిసారి నిర్మించిన టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' నిన్నటి నుంచి…

1 minute ago

20 నిమిషాల కోసం రాజమౌళి పెర్ఫెక్షన్ ఇది

రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే…

46 minutes ago

ప్రభాస్ ఫౌజీ మీద ఒత్తిడి కత్తి

ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఫౌజీ విడుదల ఎప్పుడనేది తేలడం లేదు.…

1 hour ago

నాని ఇంతకంటే నాన్చకూడదు

రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ…

2 hours ago

‘చనిపోకపోతే ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పేస్తా’

మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…

4 hours ago

లెనిన్ భాగ్యశ్రీకే రాసిపెట్టి ఉంది

ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…

11 hours ago