Political News

రూ.2 కోట్లు లాగిన రజినీ… ఏసీబీ కేసు నమోదు

వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు అయ్యింది. ఎలాంటి తప్పు చేయని ఓ కంపెనీని కేవలం వసూళ్ల కోసం టార్గెట్ చేసిన రజినీ… దాని యాజమానుల నుంచి ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూళ్లను బలవంతంగా లాక్కున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రజినీ పాత్రను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నిర్ధారించగా… తాజాగా ఏసీబీ కూడా ఆమె పాత్రను నిర్ధారించి కేసు నమోదు చేసింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ ను టార్గెట్ చేసిన రజినీ అండ్ కో.. దాని యజమానుల నుంచి రూ.5 కోట్ల వసూలుకు యత్నించింది. కంపెనీలో అక్రమాలు జరిగాయో, లేదో తెలియదు గానీ…తన నియోకజవర్గ పరిధిలో వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందేనని రజినీ కంపెనీ యజమానులకు తేల్చి చెప్పారు. అందుకు కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోవడంతో వెంటనే సదరు కంపెనీపై విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ హోదాలో ఐపీఎస్ అదికారి పల్లె జాషువా తన సిబ్బందితో కలిసి పాలుపంచుకున్నారు.

ఈ దాడులకు కూడా కంపెనీ యాజమాన్యం బెదిరకపోగా… జాషువా నేరుగా కంపెనీ యజమానులకు ఫోన్ చేసి రజినీ చెప్పినట్లు వినకపోతే… రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… వారు రజినీ కలిశారు. ఆమె సూచన మేరకు రజినీ పీఏను కలిశారు. చర్చల్లో భాగంగా రూ.5 కోట్లకు బదులుగా రూ.2.20 కోట్లకు ఇరువర్గాలు అంగీకరించాయి. ఇందులో రూ.2 కోట్లను రజినీకి చెల్లించే విధంగా ఆ మొత్తాన్ని రజినీ మరిది గోపి చేతిలో పెట్టారు. ఆ తర్వాత గోపికి రూ.10 లక్షలు, జాషువాకు రూ.10 లక్షలు సమర్పించుకున్నారు.

ఇదిలా ఉంటే… నాడు ఈ వసూళ్లకు సంబంధించి జాషువా…రజినీ చేతిలో ఆయుధంగా పనిచేశారు. రజినీ చెప్పినట్లుగా నడుచుకున్నారు. రజీని ఏం చేయమంటే అదే చేశారు. తాను ఓ ఐపీఎస్ అధికారిని అని, విజిలెన్స్ శాఖలో కీలకంగా పని చేస్తున్నానన్న విషయాన్నే ఆయన మరిచిపోయారు. విజిలెన్స్ శాఖ దాడులు చేస్తే… ఆ సమాచారాన్ని ముందుగా ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. దాడుల తర్వాత నివేదికనూ పంపుతారు. అయితే ఈ వ్యవహారంలో మాత్రం ఈ రెండు పనులను జాషువా ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ఈ కారణంగానే ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసులో ఏ1గా రజినీ, ఏ2గా జాషువా, ఏ3గా గోపి, ఏ4గా రజినీ పీఏ రామకృష్ణ పేర్లను చేర్చారు.

This post was last modified on March 23, 2025 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

2 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

4 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

11 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

12 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

12 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

14 hours ago