Political News

జ‌గ‌న్ మాదిరిగా వ‌దిలేయ‌లేదు..

వైసీపీని, జ‌గ‌న్‌ను కూడా కాద‌నుకుని.. ఏపీ ప్ర‌జ‌లు కూట‌మికి ముఖ్యంగా చంద్ర‌బాబుకు భారీ మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపిం చారో.. ఇప్పుడు అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు మేధావులు. పాల‌న‌ప‌రంగానే కాకుండా.. శాఖ‌ల వారీగా కూడా.. చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనుక్ష‌ణం ఆయ‌న దృష్టి పెడుతున్న విధానాల‌ను వారు ప్ర‌స్తావిస్తున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. పాల‌న‌పై ప‌ట్టుక‌న్నా.. పేరుపై ప‌ట్టు పెంచుకునేందుకు.. త‌న పేరు వేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారన్న విష యం తెలిసిందే. ఏం జ‌రిగినా.. అందులో ఆయ‌న పేరును ఇరికించేందుకు ప్ర‌య‌త్నించేవారు త‌ప్ప‌.. పాల‌న‌పై పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ఈ ప‌రిణామం కూడా.. వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి మ‌రో ముడిస‌రుకుగా వినియోగ‌ప‌డింది. అయితే.. చంద్ర‌బాబు స్ట‌యిలే వేరు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఆయ‌న‌కు తెలియాల్సిందే. ఎక్క‌డ ఎలాంటి స‌మాచారం ఉన్నా.. త‌న‌దృష్టికి రావాల్సిందే.. అన్న‌ట్టుగా ఆయ‌న స‌ర్కారుపై త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చాలా బిజీగా ఉన్న‌మాట వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ.. అంత బిజీలోనూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప‌థ‌కాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. మ‌రో 9 రోజుల్లో 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రం(మార్చి 31) ముగిసిపోనుంది. దీంతో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ‌న‌రులు, వ‌చ్చే నెల ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన వేత‌నాల‌పై చంద్ర‌బాబు సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

అంతేకాదు.. కీల‌క‌మైన కేంద్రం నుంచి రావాల్సిన బ‌కాయిలు.. ఈ నెల 31 దాటితే మురిగిపోయే వ‌న‌రులు.. ఇలా ఏ ఒక్క అంశాన్నీ ఆయ‌న వ‌దిలి పెట్టలేదు. శ‌నివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశవ్‌.. ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయి.. కేంద్రం నుంచి రావాల్సిన సొమ్ములు, బ‌కాయిల‌ను త‌క్ష‌ణ‌మే రప్పించుకు నేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. రాత్రికి రాత్రి.. ఢిల్లీ వెళ్లి ఆర్థిక శాఖ‌పై ఒత్తిడి పెంచాల‌ని కూడా మంత్రికి సూచించారు. దీంతో అధికారులు ఈ ప్ర‌య‌త్నాల్లో ముమ్మ‌రంగా దృష్టి పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది.

గ‌తంలో వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ఇవేవీ ప‌ట్టించుకునే వారు కాదు. సాయంత్రం 6 త‌ర్వాత‌.. తాడేప‌ల్లి గేట్లు మూసేసేవారు. దీంతో అధికారులు కూడా.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా రెండు మూడు ఆర్థిక సంవ‌త్స‌రాల్లో కేంద్రం నుంచిరావాల్సిన గ్రాంట్లు, నిధులు.. రాక‌పోగా, మురిగిపోయాయి. వీటిని స‌కాలంలో గుర్తించి ర‌ప్పించుకుని ఉంటే.. కొంత వ‌ర‌కు అప్పులు త‌గ్గేవ‌న్న చ‌ర్చ కూడా అప్ప‌ట్లో జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు జ‌గ‌న్ మాదిరిగా కాకుండా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌పై భూత‌ద్దం ప‌ట్టుకుని మ‌రీ వెతికి రూపాయి కూడా వ‌దులుకోకుండా ప్ర‌య‌త్నాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 23, 2025 3:39 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

16 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago