Political News

సిసలైన రాజకీయం మొదలెట్టిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ సిసలైన రాజకీయం ఎలా ఉంటుందన్న విషయాన్ని విడమరచి మరీ చెప్పేసింది. ”ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం… ఆ తర్వాత ప్రభుత్వం శాశ్వతం భావనతో సాగాలి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి జగన్”అంటూ లోకేశ్ కామెంట్ చేశారు. ఎంతో పరిణతి ఉంటే తప్పించి ఈ మాట రాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. సాదాసీదా రాజకీయాలు చేసే వారికి అసలు ఈ ఊహే తట్టదని కూడా వారు విశ్లేషిస్తున్నారు.

నిజమే… ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో విడుదలయ్యే ఫలితాలు ఓ సారి సిట్టింగ్ పార్టీకే పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు దక్కితే… మరికొన్ని సార్లు అప్పటిదాకా విపక్షాలుగా కొనసాగిన పార్టీల చేతులకు ఆ పగ్గాలు దక్కుతాయి. ప్రభుత్వ పగ్గాలు పట్టుకునే పార్టీలు మారవచ్చు గానీ… ప్రభుత్వాలు అయితే మారవు కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా గానీ… దానిని ఒప్పుకునేందుకు మాత్రం చాలా మంది సిద్ధపడరు. అది వారిలోని నారో మైండెడ్ నెస్ కు నిదర్శనమని చెప్పాలి. పార్టీలు మారినా ప్రభుత్వం మారదు కదా. అందుకే కదా…గత ప్రభుత్వం చేసిన అప్పులను ఆ తర్వాత వచ్చే పార్టీల ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. గత పార్టీ ప్రభుత్వాలు పెండింగ్ పెట్టిన బిల్లులను ఆ తర్వాత వచ్చే పార్టీ ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి కదా.

శుక్రవారం కూడా ఏపీలో గత ఐధేళ్ల పాటు పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి దిగిపోతే… ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు వాటిని చెల్లిస్తోంది. ఇప్పటికే తొలి విడత కింద రూ.788 కోట్లను కూటమి సర్కారు చెల్లించింది. తాజాగా శుక్రవారం ఈ బకాయిల్లో మరో రూ.600 కోట్లను విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.400 కోట్లను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రభుత్వం, రాజకీయం… వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరహాలో ముందుకు సాగే నేతలు తిరుగు లేని నేతలుగా ఎదిగి తీరుతారని గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. ఆ దిశగానే లోకేశ్ కూడా పయనిస్తున్నారని చెప్పక తప్పదు.

This post was last modified on March 22, 2025 11:46 am

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

15 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

28 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

39 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago