టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ సిసలైన రాజకీయం ఎలా ఉంటుందన్న విషయాన్ని విడమరచి మరీ చెప్పేసింది. ”ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం… ఆ తర్వాత ప్రభుత్వం శాశ్వతం భావనతో సాగాలి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి జగన్”అంటూ లోకేశ్ కామెంట్ చేశారు. ఎంతో పరిణతి ఉంటే తప్పించి ఈ మాట రాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. సాదాసీదా రాజకీయాలు చేసే వారికి అసలు ఈ ఊహే తట్టదని కూడా వారు విశ్లేషిస్తున్నారు.
నిజమే… ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో విడుదలయ్యే ఫలితాలు ఓ సారి సిట్టింగ్ పార్టీకే పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు దక్కితే… మరికొన్ని సార్లు అప్పటిదాకా విపక్షాలుగా కొనసాగిన పార్టీల చేతులకు ఆ పగ్గాలు దక్కుతాయి. ప్రభుత్వ పగ్గాలు పట్టుకునే పార్టీలు మారవచ్చు గానీ… ప్రభుత్వాలు అయితే మారవు కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా గానీ… దానిని ఒప్పుకునేందుకు మాత్రం చాలా మంది సిద్ధపడరు. అది వారిలోని నారో మైండెడ్ నెస్ కు నిదర్శనమని చెప్పాలి. పార్టీలు మారినా ప్రభుత్వం మారదు కదా. అందుకే కదా…గత ప్రభుత్వం చేసిన అప్పులను ఆ తర్వాత వచ్చే పార్టీల ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. గత పార్టీ ప్రభుత్వాలు పెండింగ్ పెట్టిన బిల్లులను ఆ తర్వాత వచ్చే పార్టీ ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి కదా.
శుక్రవారం కూడా ఏపీలో గత ఐధేళ్ల పాటు పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి దిగిపోతే… ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు వాటిని చెల్లిస్తోంది. ఇప్పటికే తొలి విడత కింద రూ.788 కోట్లను కూటమి సర్కారు చెల్లించింది. తాజాగా శుక్రవారం ఈ బకాయిల్లో మరో రూ.600 కోట్లను విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.400 కోట్లను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రభుత్వం, రాజకీయం… వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరహాలో ముందుకు సాగే నేతలు తిరుగు లేని నేతలుగా ఎదిగి తీరుతారని గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. ఆ దిశగానే లోకేశ్ కూడా పయనిస్తున్నారని చెప్పక తప్పదు.
This post was last modified on March 22, 2025 11:46 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…