నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో డీఎంకే అదినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై వేదికగా ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. డీఎంకే మంత్రులు, ఎంపీలను పంపి మరీ… ఆయా పార్టీల నేతలకు స్టాలిన్ ఆహ్వానాలు అందేలా చూశారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రమే ఆయన శంషాబాద్ నుంచి చెన్నై బయలు దేరనున్నారు. ఈ భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతున్నారు.
స్టాలిన్ భేటీని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్వాగతించింది. స్టాలిన్ భేటీకి తాము హాజరవుతామని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు కూడా. అయితే చెన్నై వెళ్లే వారెవరు అన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన మొన్న వెల్లడించారు. తాజాగా భేటీ సమయం దగ్గరపడిన వేళ… చెన్నైలో శనివారం జరగనున్న సదరు భేటీకి తానే స్వయంగా హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అనుకోవడమే కాకుండా ఏకంగా శుక్రవారం రాత్రి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏకంగా చెన్నై ఫ్లైట్ ఎక్కేశారు. కేటీఆర్ వెంట పార్టీ నేతలు జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డిలు చెన్నై వెళ్లారు.
దక్షిణాది రాష్ట్రాల తరఫున కేంద్రానికి దక్షిణాది వాణిని బలంగా వినిపించే దిశగా సాగుతున్న ఈ భేటీలో కేటీఆర్, రేవంత్ కే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. పిన్న వయసులోనే కీలక పదవులను అలంకరించిన వీరిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కూడా ఓ రేంజిలో సాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం మాటల తూటాలు పేల్చుకుంటున్న ఈ ఇద్దరు నేతలు అనూహ్యంగా ఓ కీలక విషయంపై ఒకే మాటగా ఒకే బాటగా సాగేందుకు నడుం బిగించడాన్ని చూస్తుంటే… నిజంగానే వీరిద్దరే శనివారం నాటి భేటీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారని చెప్పక తప్పదు.
This post was last modified on March 22, 2025 7:33 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…