నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో డీఎంకే అదినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై వేదికగా ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. డీఎంకే మంత్రులు, ఎంపీలను పంపి మరీ… ఆయా పార్టీల నేతలకు స్టాలిన్ ఆహ్వానాలు అందేలా చూశారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రమే ఆయన శంషాబాద్ నుంచి చెన్నై బయలు దేరనున్నారు. ఈ భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతున్నారు.
స్టాలిన్ భేటీని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్వాగతించింది. స్టాలిన్ భేటీకి తాము హాజరవుతామని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు కూడా. అయితే చెన్నై వెళ్లే వారెవరు అన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన మొన్న వెల్లడించారు. తాజాగా భేటీ సమయం దగ్గరపడిన వేళ… చెన్నైలో శనివారం జరగనున్న సదరు భేటీకి తానే స్వయంగా హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అనుకోవడమే కాకుండా ఏకంగా శుక్రవారం రాత్రి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏకంగా చెన్నై ఫ్లైట్ ఎక్కేశారు. కేటీఆర్ వెంట పార్టీ నేతలు జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డిలు చెన్నై వెళ్లారు.
దక్షిణాది రాష్ట్రాల తరఫున కేంద్రానికి దక్షిణాది వాణిని బలంగా వినిపించే దిశగా సాగుతున్న ఈ భేటీలో కేటీఆర్, రేవంత్ కే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. పిన్న వయసులోనే కీలక పదవులను అలంకరించిన వీరిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కూడా ఓ రేంజిలో సాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం మాటల తూటాలు పేల్చుకుంటున్న ఈ ఇద్దరు నేతలు అనూహ్యంగా ఓ కీలక విషయంపై ఒకే మాటగా ఒకే బాటగా సాగేందుకు నడుం బిగించడాన్ని చూస్తుంటే… నిజంగానే వీరిద్దరే శనివారం నాటి భేటీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారని చెప్పక తప్పదు.
భోళా శంకర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ని మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ దాదాపుగా పూడ్చేసింది. అయితే ఒకప్పటిలా…
పెద్దిలో కొత్త సీన్లు కలుపుతారని, కొంత ఎడిటింగ్ జరుగుతుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది. ఇవాళ జరిగిన ప్రెస్…
గీత రచయిత అనంత శ్రీరామ్ కు కోపం వచ్చేసింది. ఘాటుగా కాకపోయినా మాములుగా మాట్లాడుతూనే లేనిపోని విమర్శలకు తావు ఇచ్చినట్టయ్యింది.…
ఎంత సంపాదించినా.. అందులోంచి ఎంతో కొంత లేని వారికి ఇవ్వడంలో ఉండే సంతోషమే వేరు. ఈ ఆనందాన్ని అందరూ అనుభవించరు,…
స్టార్ హీరో హీరోయిన్లు నటించకపోయినా.. పేరున్న దర్శకుడు తీయకపోయినా.. స్టన్నింగ్ విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి అంచనాలు పెంచిన సినిమా..…
తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ హీరోగా ఎదిగిన ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 90వ దశకంలో జగదేక…