నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో డీఎంకే అదినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై వేదికగా ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. డీఎంకే మంత్రులు, ఎంపీలను పంపి మరీ… ఆయా పార్టీల నేతలకు స్టాలిన్ ఆహ్వానాలు అందేలా చూశారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రమే ఆయన శంషాబాద్ నుంచి చెన్నై బయలు దేరనున్నారు. ఈ భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతున్నారు.
స్టాలిన్ భేటీని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్వాగతించింది. స్టాలిన్ భేటీకి తాము హాజరవుతామని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు కూడా. అయితే చెన్నై వెళ్లే వారెవరు అన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన మొన్న వెల్లడించారు. తాజాగా భేటీ సమయం దగ్గరపడిన వేళ… చెన్నైలో శనివారం జరగనున్న సదరు భేటీకి తానే స్వయంగా హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అనుకోవడమే కాకుండా ఏకంగా శుక్రవారం రాత్రి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏకంగా చెన్నై ఫ్లైట్ ఎక్కేశారు. కేటీఆర్ వెంట పార్టీ నేతలు జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డిలు చెన్నై వెళ్లారు.
దక్షిణాది రాష్ట్రాల తరఫున కేంద్రానికి దక్షిణాది వాణిని బలంగా వినిపించే దిశగా సాగుతున్న ఈ భేటీలో కేటీఆర్, రేవంత్ కే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. పిన్న వయసులోనే కీలక పదవులను అలంకరించిన వీరిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కూడా ఓ రేంజిలో సాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం మాటల తూటాలు పేల్చుకుంటున్న ఈ ఇద్దరు నేతలు అనూహ్యంగా ఓ కీలక విషయంపై ఒకే మాటగా ఒకే బాటగా సాగేందుకు నడుం బిగించడాన్ని చూస్తుంటే… నిజంగానే వీరిద్దరే శనివారం నాటి భేటీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారని చెప్పక తప్పదు.
This post was last modified on March 22, 2025 7:33 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…