Political News

మండ‌లిలో వైసీపీ.. మునుగుతున్న ప‌డ‌వేనా ..!

ఏపీ విప‌క్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్న‌చందంగా ప‌రిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11 మంది స‌భ్యులే ఉన్నారు. దీంతో ఇక్క‌డ ప్ర‌దాన ప్ర‌తిపక్ష హోదా ద‌క్క‌లేదు. ద‌క్కుతుంద‌న్న ఆశ‌లు కూడా క‌నిపించ‌డం లేదు. దీనిపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. కానీ, అధికార కూట‌మి మాత్రం వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఉన్న శాస‌న మండ‌లిలో కూడా ఇప్పుడు వైసీపీకి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. మొత్తం 58 మంది స‌భ్యులున్న మండ‌లిలో వైసీపీకి 35 మంది స‌భ్యులు ఉన్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, ఇత‌ర నామినేటెడ్ స‌హా.. ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు.. ఇత‌రులు ఉన్నారు. అయితే.. వైసీపీకి ఉన్న వారిలో తాజాగా చిల‌క‌లూరిపేట‌కు చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. వైసీపీకి ఆయ‌న రాజీనామా చేయ‌డంతో ఆయ‌న స‌భ్య‌త్వంపై ప్ర‌భావం ప‌డ‌క‌పోయినా.. పార్టీ త‌ర‌ఫున ఆయ‌న గ‌ళం వినిపించే అవకాశం లేదు.

అంటే.. వైసీపీ త‌ర‌ఫున కాకుండా.. ఇండిపెండెంటుగానే ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం

ఉన్న మండ‌లిలో వైసీపీ త‌ర‌ఫున ఉన్న‌వారు.. ఐదుగురు ఆ పార్టీకి, న‌లుగురు ఏకంగా మండ‌లికి కూడా రాజీనామాలు చేశారు. దీంతో వైసీపీ బ‌లం త‌గ్గిపోతోంది. రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాదికి మ‌రో 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి జారి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంటే.. వైసీపీ బ‌లం మ‌రింత త‌గ్గ‌నుంది.

ఈ ప‌రిణామం.. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీకి అసెంబ్లీ లో బ‌లం లేదు. ఈ నేప‌థ్యంలో మండలే కీల‌కం. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు మండ‌లి నుంచి కూడా నాయ‌కులు జారి పోతున్న నేప‌థ్యంలో మునిగిపోతున్న ప‌డ‌వ‌ను త‌ల‌పిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి రాజ‌కీయ వ్యూహాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌క‌పోతే.. వైసీపీ మ‌రింత డైల్యూట్ అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌పై ఎత్తులకు పై ఎత్తులు వేసి.. నాయ‌కుల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అవ‌స‌రం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 20, 2025 4:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago