Political News

మండ‌లిలో వైసీపీ.. మునుగుతున్న ప‌డ‌వేనా ..!

ఏపీ విప‌క్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్న‌చందంగా ప‌రిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11 మంది స‌భ్యులే ఉన్నారు. దీంతో ఇక్క‌డ ప్ర‌దాన ప్ర‌తిపక్ష హోదా ద‌క్క‌లేదు. ద‌క్కుతుంద‌న్న ఆశ‌లు కూడా క‌నిపించ‌డం లేదు. దీనిపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. కానీ, అధికార కూట‌మి మాత్రం వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఉన్న శాస‌న మండ‌లిలో కూడా ఇప్పుడు వైసీపీకి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. మొత్తం 58 మంది స‌భ్యులున్న మండ‌లిలో వైసీపీకి 35 మంది స‌భ్యులు ఉన్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, ఇత‌ర నామినేటెడ్ స‌హా.. ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు.. ఇత‌రులు ఉన్నారు. అయితే.. వైసీపీకి ఉన్న వారిలో తాజాగా చిల‌క‌లూరిపేట‌కు చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. వైసీపీకి ఆయ‌న రాజీనామా చేయ‌డంతో ఆయ‌న స‌భ్య‌త్వంపై ప్ర‌భావం ప‌డ‌క‌పోయినా.. పార్టీ త‌ర‌ఫున ఆయ‌న గ‌ళం వినిపించే అవకాశం లేదు.

అంటే.. వైసీపీ త‌ర‌ఫున కాకుండా.. ఇండిపెండెంటుగానే ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం

ఉన్న మండ‌లిలో వైసీపీ త‌ర‌ఫున ఉన్న‌వారు.. ఐదుగురు ఆ పార్టీకి, న‌లుగురు ఏకంగా మండ‌లికి కూడా రాజీనామాలు చేశారు. దీంతో వైసీపీ బ‌లం త‌గ్గిపోతోంది. రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాదికి మ‌రో 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి జారి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంటే.. వైసీపీ బ‌లం మ‌రింత త‌గ్గ‌నుంది.

ఈ ప‌రిణామం.. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీకి అసెంబ్లీ లో బ‌లం లేదు. ఈ నేప‌థ్యంలో మండలే కీల‌కం. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు మండ‌లి నుంచి కూడా నాయ‌కులు జారి పోతున్న నేప‌థ్యంలో మునిగిపోతున్న ప‌డ‌వ‌ను త‌ల‌పిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి రాజ‌కీయ వ్యూహాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌క‌పోతే.. వైసీపీ మ‌రింత డైల్యూట్ అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌పై ఎత్తులకు పై ఎత్తులు వేసి.. నాయ‌కుల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అవ‌స‌రం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 20, 2025 4:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

6 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

50 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago