ఏపీ విపక్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నచందంగా పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11 మంది సభ్యులే ఉన్నారు. దీంతో ఇక్కడ ప్రదాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. దక్కుతుందన్న ఆశలు కూడా కనిపించడం లేదు. దీనిపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, అధికార కూటమి మాత్రం వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీలో వైసీపీ సభ్యులు కనిపించడం లేదు.
మరోవైపు.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న శాసన మండలిలో కూడా ఇప్పుడు వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొత్తం 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 35 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీ, జనసేన, ఇతర నామినేటెడ్ సహా.. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు.. ఇతరులు ఉన్నారు. అయితే.. వైసీపీకి ఉన్న వారిలో తాజాగా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. వైసీపీకి ఆయన రాజీనామా చేయడంతో ఆయన సభ్యత్వంపై ప్రభావం పడకపోయినా.. పార్టీ తరఫున ఆయన గళం వినిపించే అవకాశం లేదు.
అంటే.. వైసీపీ తరఫున కాకుండా.. ఇండిపెండెంటుగానే ఆయన వ్యవహరించనున్నారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం
ఉన్న మండలిలో వైసీపీ తరఫున ఉన్నవారు.. ఐదుగురు ఆ పార్టీకి, నలుగురు ఏకంగా మండలికి కూడా రాజీనామాలు చేశారు. దీంతో వైసీపీ బలం తగ్గిపోతోంది. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం.. వచ్చే ఏడాదికి మరో 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి జారి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే.. వైసీపీ బలం మరింత తగ్గనుంది.
ఈ పరిణామం.. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీకి అసెంబ్లీ లో బలం లేదు. ఈ నేపథ్యంలో మండలే కీలకం. ఇలాంటి సమయంలో ఇప్పుడు మండలి నుంచి కూడా నాయకులు జారి పోతున్న నేపథ్యంలో మునిగిపోతున్న పడవను తలపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కూటమి రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే.. వైసీపీ మరింత డైల్యూట్ అయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలపై ఎత్తులకు పై ఎత్తులు వేసి.. నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేయడం అవసరం. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 20, 2025 4:36 pm
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…