Political News

లాక్ డౌన్ వేళ… మంత్రిగారి హంగామా చూశారా?

ప్రాణాంతక వైరస్ కరోనా విజృంభణ నేపథ్యంలో యావత్తు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది. ఎక్కడికక్కడ కరోనాను కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖానికి మాస్క లేకపోయినా, అనవసరంగా బయటకు వచ్చినా, నిత్యావసర సరుకుల కొనుగోలులో భౌతిక దూరం పాటించకపోయినా… కఠిన చర్యలేనంటూ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోడై కూస్తున్నాయి.

నిబంధన అమలులో కఠినంగానూ వ్యవహరిస్తామంటూ అధికార పార్టీలకు చెందిన నేతలు పదే పదే చెబుతున్నారు. అయితే సాగర నగరం విశాఖలో ఏపీ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేస్తున్న అవంతి శ్రీనివాస్… కరోనా వేళ పేదలకు సాయం పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరినీ షాక్ కు గురి చేసిందని చెప్పక తప్పదు.

కరోనా వేళ… గ్రీన్ జోన్ లో పరిస్థితి ఎలా ఉన్నా.. రెడ్ జోన్ కఠినాతికఠిన నియమాలు అమలవుతున్నాయి. రెడ్ జోన్ లో ఎలాంటి కార్యక్రమాలకు ఆస్కారమే లేదు. ఈ జోన్ లోని ప్రజలను బయటకు రానివ్వరు. బయటి వారిని అందలోకి ఎంట్రీ కానివ్వరు. అయితే మంత్రి హోదాలో ఉన్న అవంతి విశాఖలోని రెడ్ జోన్ ఏకంగా ‘సాయం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా హాజరయ్యాయి.

సాయం అందుకునేందుకు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. సరే… ఏదో ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తున్నారులే అనుకుంటే… రెడ్ జోన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అసలు భౌతిక దూరం అన్న మాటే కనిపించలేదు.

ఓ వైపు భౌతిక దూరం పాటించకుండా జనం సాయం కోసం ఎగబడితే… మరోపక్క కార్యక్రమ నిర్వహణ పేరిట మంత్రి అనుచరులు ముఖానికి మాస్కులు కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపించింది.

కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న మంత్రే ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తే… సదరు కార్యక్రమంలో లాక్ డౌన్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కేశారన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారిపోయింది.

Satya

Recent Posts

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

20 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

7 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

8 hours ago