బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎఫ్ ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. ఫోన్ట్యాపింగ్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు హరీష్రావును ఏ1గా పేర్కొంటూ గతంలో కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసును కొట్టి వేయాలని.. రాజకీయ కక్ష సాధింపుల క్రమంలోనే తనపై కేసు నమోదైందని పేర్కొన్నారు.
ఈ కేసులో హరీష్ రావుతోపాటు రాధాకిషన్ రావుపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇరువురిపైనా ఎఫ్ ఐఆర్లు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. ఏ ఆధారాలతో కేసు నమోదు చేశారని ప్రశ్నించింది. దీనికి కొంత సమయం కావాలని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టును కోరారు. అయితే.. ఆధారాలు లేకుండా ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం సరికాదని పేర్కొంటూ కోర్టు సదరు ఎఫ్ ఐఆర్ను కొట్టి వేసింది.
బీఆర్ ఎస్ హయాంలో 2023 ఎన్నికలకుముందు ప్రముఖ నాయకులు, ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనిలో నేరుగా పోలీసుల ప్రమేయం ఉందన్న వాదన కూడా వినిపించింది. దీనిపై విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలువురు అధికారులపై కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందని తెలియడంతో వారిపైనా కేసుల నమోదుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే చక్రధర్ గౌడ్ ఆరుమాసాల కిందట హరీష్ రావు సహా.. రాధాకిషన్రావులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 1:06 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…