వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్-2)గా ఉన్న సునీల్ యాదవ్ సైతం.. అప్రూవర్గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానందరెడ్డి హత్యకు చాలానే కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవరున్నారు? అసలు ఈ ప్లాన్ ఎవరిది అనేది చెప్పేస్తా“ అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉదయం కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్.. మీడియాతో మాట్లాడారు.
వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక చాలానే కుట్ర జరిగిందన్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని.. అనేక బాధలు పడ్డానని సునీల్ చెప్పారు. కానీ, తననే బెదిరిస్తున్న పరిస్థితి ఎదురవుతోందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చినప్పుడు కూడా తనకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సునీల్ వెల్లడించారు. తాను భయ పడుతూ ఎన్నాళ్లు బతకాలని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో వివేకా దారుణ హత్యకు కుట్ర వెనుక ఎవరున్నారనే విషయాన్ని త్వరలోనే చెప్పనున్నట్టు తెలిపారు. బెయిల్పై ఉన్న తనకు పులివెందులలోని వైసీపీ నాయకులు, వారి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణభయం ఉందన్నారు. వారి వేధింపులు, బెదిరింపులను భరించలేక పోతున్నట్టు తెలిపారు. చంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా.. తాను ఇలానే ప్రాణ భయంతో బతకాల్సివచ్చిందని సునీల్ యాదవ్ వెల్లడించారు.
కాగా.. వివేకా కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన దస్తగిరికి సైతం కొందరి నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు రక్షణ కల్పించాలని కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు.. ఇటీవల కూడా దస్తగిరి భార్యపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేసిన కొట్టారు. దస్తగిరిని లేపేస్తామంటూ.. బెదిరింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ కుమార్ సైతం తనకు బెదిరింపులు వస్తున్నాయని ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 1:02 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…