వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్-2)గా ఉన్న సునీల్ యాదవ్ సైతం.. అప్రూవర్గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానందరెడ్డి హత్యకు చాలానే కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవరున్నారు? అసలు ఈ ప్లాన్ ఎవరిది అనేది చెప్పేస్తా“ అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉదయం కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్.. మీడియాతో మాట్లాడారు.
వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక చాలానే కుట్ర జరిగిందన్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని.. అనేక బాధలు పడ్డానని సునీల్ చెప్పారు. కానీ, తననే బెదిరిస్తున్న పరిస్థితి ఎదురవుతోందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చినప్పుడు కూడా తనకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సునీల్ వెల్లడించారు. తాను భయ పడుతూ ఎన్నాళ్లు బతకాలని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో వివేకా దారుణ హత్యకు కుట్ర వెనుక ఎవరున్నారనే విషయాన్ని త్వరలోనే చెప్పనున్నట్టు తెలిపారు. బెయిల్పై ఉన్న తనకు పులివెందులలోని వైసీపీ నాయకులు, వారి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణభయం ఉందన్నారు. వారి వేధింపులు, బెదిరింపులను భరించలేక పోతున్నట్టు తెలిపారు. చంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా.. తాను ఇలానే ప్రాణ భయంతో బతకాల్సివచ్చిందని సునీల్ యాదవ్ వెల్లడించారు.
కాగా.. వివేకా కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన దస్తగిరికి సైతం కొందరి నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు రక్షణ కల్పించాలని కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు.. ఇటీవల కూడా దస్తగిరి భార్యపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేసిన కొట్టారు. దస్తగిరిని లేపేస్తామంటూ.. బెదిరింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ కుమార్ సైతం తనకు బెదిరింపులు వస్తున్నాయని ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 1:02 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…