వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్-2)గా ఉన్న సునీల్ యాదవ్ సైతం.. అప్రూవర్గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానందరెడ్డి హత్యకు చాలానే కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవరున్నారు? అసలు ఈ ప్లాన్ ఎవరిది అనేది చెప్పేస్తా“ అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉదయం కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్.. మీడియాతో మాట్లాడారు.
వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక చాలానే కుట్ర జరిగిందన్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని.. అనేక బాధలు పడ్డానని సునీల్ చెప్పారు. కానీ, తననే బెదిరిస్తున్న పరిస్థితి ఎదురవుతోందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చినప్పుడు కూడా తనకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సునీల్ వెల్లడించారు. తాను భయ పడుతూ ఎన్నాళ్లు బతకాలని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో వివేకా దారుణ హత్యకు కుట్ర వెనుక ఎవరున్నారనే విషయాన్ని త్వరలోనే చెప్పనున్నట్టు తెలిపారు. బెయిల్పై ఉన్న తనకు పులివెందులలోని వైసీపీ నాయకులు, వారి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణభయం ఉందన్నారు. వారి వేధింపులు, బెదిరింపులను భరించలేక పోతున్నట్టు తెలిపారు. చంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా.. తాను ఇలానే ప్రాణ భయంతో బతకాల్సివచ్చిందని సునీల్ యాదవ్ వెల్లడించారు.
కాగా.. వివేకా కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన దస్తగిరికి సైతం కొందరి నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు రక్షణ కల్పించాలని కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు.. ఇటీవల కూడా దస్తగిరి భార్యపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేసిన కొట్టారు. దస్తగిరిని లేపేస్తామంటూ.. బెదిరింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ కుమార్ సైతం తనకు బెదిరింపులు వస్తున్నాయని ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 1:02 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…