కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ నేత, హైదరాబాద్ పాత బస్తీ పరిధి గోషా మహల్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న రాజాసింగ్ వ్యవహారం నిత్యం ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. ముస్లింలు అత్యధికంగా కలిగిన పాత బస్తీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న రాజాసింగ్ చుట్టు నిత్యం వివాదాలే తిరుగాడుతూ ఉంటాయి. తాజాగా ఓ విషయం రాజాసింగ్ ను మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. భద్రత కారణాల రీత్యా బుల్లెట్ ప్రూఫ్ కారును వినియోగించమని పోలీసులు చెబితే… అందుకు ససేమిరా అన్న రాజా సింగ్… తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలంటూ కోరి ఖాకీలకు షాకిచ్చారు.
హిందూ భావజాలాన్ని బలంగా వినిపించే వ్యక్తుల్లో రాజాసింగ్ ముందు వరుసలో ఉంటారు. ఇటీవలే రంగుల కేళీ హోలీ సందర్భంగా పోలీసులు విధివిధానాలను జారీ చేస్తే…అనాదిగా హోలీ వేడుకలను జరుపుకుంటున్న హిందువులు ఇప్పుడు పోలీసులు చెప్పినట్లు నడుచుకోవాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో రాజాసింగ్ కు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో మంగళ్ హట్ పోలీసులు రాజిసింగ్ ను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా బయటకు వస్తే… బుల్లెట్ ప్రూఫ్ కారు లేనిదే రావద్దని, భద్రతను కూడా 1 ప్లస్ 4తోనే బయటకు రావాలని సూచించారు. ఈ మేరకు మంగళ్ హట్ పోలీసులు ఆయనకు అధికారికంగానే నోటీసులు జారీ చేశారు.
ఈ వేకప్ కాల్స్ ను రాజాసింగ్ చాలా లైట్ గా తీసుకున్నారు. తన నియోజకవర్గం మొత్తం చిన్న చిన్న గల్లీలతో కూడుకుని ఉంటుందని..అందులో బుల్లెట్ ప్రూఫ్ కారును వినియోగించడం సాధ్యం కాదని పోలీసులకు తేల్చి చెప్పేశారట. అంతేకాకుండా తాను గన్ లైసెన్స్ కోసం చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన రాజాసింగ్.. ముందుగా దాని సంగతేంటో తేల్చండని కోరారట. బుల్టెల్ ప్రూఫ్ కారు తాను వాడనని… తన ఆత్మరక్షణ కోసం కోరిన గన్ లైసెన్స్ ను మాత్రం తనకు ఇవ్వాలంటూ కోరిన రాజాసింగ్ పోలీసులను షాక్ కు గురి చేశారు. మరి రాజాసింగ్ ప్రతిపాదనపై పోలీసులు ఎలా స్పందిస్తారోనన్న దానిపై ఆసక్తి నెలకొంది.
This post was last modified on March 20, 2025 12:36 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…