Political News

గోరంట్ల సహా ముగ్గురికి గాయాలు… ఏం జరిగింది?

ఏపీలో శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులకు ప్రస్తుతం క్రీడా పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో హోదాలు, వయసును పక్కనపెట్టేసిన ప్రజా ప్రతినిధులు చిన్న పిల్లల మాదిరి కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహంగా క్రీడల్లో పాలుపంచుకుంటున్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను బయటకు తీస్తున్నారు. అయితే క్రీడలకు ఎంతైనా ఫిట్ నెస్ అవసరం కదా. అంతేకాకుండా ఒకింత గ్యాప్ వచ్చిందంటే… తిరిగి పుంజుకోవడానికి కాస్తంత సమయం కూడా పడుతుంది. ఈ క్రమంలో కాలు జారడం, కింద పడటం, దెబ్బలు తగలడం కూడా జరిగిపోతుంటాయి.

ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లోనూ గురువారం అదే జరిగింది. గురువారం తెల్లారగానే… చల్లటి వాతావరణంలో ప్రజా ప్రతినిధుల మద్య కబడ్డీ పోటీలు జరిగాయి. కబడ్డీలో టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉత్సాహం పాలుపంచుకున్నారు. కూతకు వచ్చిన ప్రత్యర్థి జట్టు సభ్యుడిని పట్టుకునే క్రమంలో ఆయన అదుపు తప్పి వెనక్కు పడిపోయారు. దీంతో వెనుకే ఉన్న కుర్చీల మీదుగా ఆయన తల పడిపోగా… తలకు గాయమైంది.

ఇక పులివెందుల టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా ఈ క్రీడల్లో గాయపడ్డారు. అదే సమయంలో జనసేన నేత, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఈ క్రీడా పోటీల్లో గాయపడ్డారు. రాంభూపాల్ రెడ్డి ఒకింత బొద్దుగా ఉన్నా… అరవ శ్రీధర్ మాత్రం ఫిట్ గానే కనిపిస్తారు. అయినా వీరిద్దరూ గాయపడటం గమనార్హం. ఎంతైనా ఇటీవల రాజకీయాల్లో పడి వీరంతా క్రీడలను అలా పక్కనపెట్టేశారు కదా. అందుకే ఇలా గ్రౌండ్ లో దిగగానే అలా గాయపడ్డారు. బుచ్చయ్య, రెడ్డి, శ్రీధర్ లను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

This post was last modified on March 20, 2025 12:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

8 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

10 hours ago