ఏపీలో శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులకు ప్రస్తుతం క్రీడా పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో హోదాలు, వయసును పక్కనపెట్టేసిన ప్రజా ప్రతినిధులు చిన్న పిల్లల మాదిరి కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహంగా క్రీడల్లో పాలుపంచుకుంటున్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను బయటకు తీస్తున్నారు. అయితే క్రీడలకు ఎంతైనా ఫిట్ నెస్ అవసరం కదా. అంతేకాకుండా ఒకింత గ్యాప్ వచ్చిందంటే… తిరిగి పుంజుకోవడానికి కాస్తంత సమయం కూడా పడుతుంది. ఈ క్రమంలో కాలు జారడం, కింద పడటం, దెబ్బలు తగలడం కూడా జరిగిపోతుంటాయి.
ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లోనూ గురువారం అదే జరిగింది. గురువారం తెల్లారగానే… చల్లటి వాతావరణంలో ప్రజా ప్రతినిధుల మద్య కబడ్డీ పోటీలు జరిగాయి. కబడ్డీలో టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉత్సాహం పాలుపంచుకున్నారు. కూతకు వచ్చిన ప్రత్యర్థి జట్టు సభ్యుడిని పట్టుకునే క్రమంలో ఆయన అదుపు తప్పి వెనక్కు పడిపోయారు. దీంతో వెనుకే ఉన్న కుర్చీల మీదుగా ఆయన తల పడిపోగా… తలకు గాయమైంది.
ఇక పులివెందుల టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా ఈ క్రీడల్లో గాయపడ్డారు. అదే సమయంలో జనసేన నేత, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఈ క్రీడా పోటీల్లో గాయపడ్డారు. రాంభూపాల్ రెడ్డి ఒకింత బొద్దుగా ఉన్నా… అరవ శ్రీధర్ మాత్రం ఫిట్ గానే కనిపిస్తారు. అయినా వీరిద్దరూ గాయపడటం గమనార్హం. ఎంతైనా ఇటీవల రాజకీయాల్లో పడి వీరంతా క్రీడలను అలా పక్కనపెట్టేశారు కదా. అందుకే ఇలా గ్రౌండ్ లో దిగగానే అలా గాయపడ్డారు. బుచ్చయ్య, రెడ్డి, శ్రీధర్ లను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
This post was last modified on March 20, 2025 12:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…