Infy Narayana Murthy
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర కామెంట్లు లెక్కలేనన్ని వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్లలో కొన్ని కామెంట్లు ఆయా రంగాలకు చెందిన కీలక వ్యక్తులు చేస్తున్నవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అమితాసక్తి రేకెత్తించేవే.
ఇలాంటి కామెంట్లలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన కామెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత కూడా ఓ ఏడాది పాటు కరోనాతో సహజీవనం చేయక తప్పదని ఆయన చేసిన కామెంట్ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు.
కరోనా విలయంతో నిజంగానే ఇప్పుడు మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోక తప్పదన్న వాదనలు అన్ని కోణాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖానికి మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం ఇకపై మన దైనందిన జీవితాల్లో భాగం కాక తప్పదన్న వాదన అందరూ అంగీకరిస్తున్నదే.
ఇలాంటి తరుణంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని పక్కాగా అమలు చేస్తోందని మూర్తి కితాబిచ్చారు. అదే సమయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కాగానే అమలు చేస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
కరోనా కారణంగా దేశంలో పాజిటివ్ గా తేలిన వారిలో కేవలం 0.25 శాతం మందే చనిపోతున్నారని, 137 కోట్ల జనాభా ఉన్న భారత్ లో ఈ శాతం మరణాల రేటు అంత తక్కువేమీ కాదని కూడా మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ మరణాల శాతం దేశంలో 0.7 శాతంగా ఉండగా… కరోనా మరణాల శాతం 0,25 శాతంగా ఉంటున్నాయంటే… ఆ వైరస్ ఎంత ప్రమాదకారి అన్న విషయం ఇట్టే తేలిపోతుందని కూడా మూర్తి పేర్కొన్నారు.
అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనా ఉధృతి తగ్గాక కూడా ఈ వైరస్ కు మనల్ని మన దూరంగా ఉంచుకోవాలంటే మాస్కు, కళ్లద్దాలు, గౌన్లు వాడక తప్పదని, ఈ తరహా జీవన విధానం 12 నుంచి 13 నెలలు కొనసాగక తప్పదని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఓ ఏడాది పాటు కరోనాతో సహజీవనం చేయక తప్పదని మూర్తి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… మూర్తి మాదిరే కరోనాతో సహజీవనం చేయక తప్పదన్న మాటను ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట కూడా వినిపించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 30, 2020 12:12 pm
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…