Infy Narayana Murthy
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర కామెంట్లు లెక్కలేనన్ని వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్లలో కొన్ని కామెంట్లు ఆయా రంగాలకు చెందిన కీలక వ్యక్తులు చేస్తున్నవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అమితాసక్తి రేకెత్తించేవే.
ఇలాంటి కామెంట్లలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన కామెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత కూడా ఓ ఏడాది పాటు కరోనాతో సహజీవనం చేయక తప్పదని ఆయన చేసిన కామెంట్ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు.
కరోనా విలయంతో నిజంగానే ఇప్పుడు మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోక తప్పదన్న వాదనలు అన్ని కోణాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖానికి మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం ఇకపై మన దైనందిన జీవితాల్లో భాగం కాక తప్పదన్న వాదన అందరూ అంగీకరిస్తున్నదే.
ఇలాంటి తరుణంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని పక్కాగా అమలు చేస్తోందని మూర్తి కితాబిచ్చారు. అదే సమయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కాగానే అమలు చేస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
కరోనా కారణంగా దేశంలో పాజిటివ్ గా తేలిన వారిలో కేవలం 0.25 శాతం మందే చనిపోతున్నారని, 137 కోట్ల జనాభా ఉన్న భారత్ లో ఈ శాతం మరణాల రేటు అంత తక్కువేమీ కాదని కూడా మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ మరణాల శాతం దేశంలో 0.7 శాతంగా ఉండగా… కరోనా మరణాల శాతం 0,25 శాతంగా ఉంటున్నాయంటే… ఆ వైరస్ ఎంత ప్రమాదకారి అన్న విషయం ఇట్టే తేలిపోతుందని కూడా మూర్తి పేర్కొన్నారు.
అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనా ఉధృతి తగ్గాక కూడా ఈ వైరస్ కు మనల్ని మన దూరంగా ఉంచుకోవాలంటే మాస్కు, కళ్లద్దాలు, గౌన్లు వాడక తప్పదని, ఈ తరహా జీవన విధానం 12 నుంచి 13 నెలలు కొనసాగక తప్పదని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఓ ఏడాది పాటు కరోనాతో సహజీవనం చేయక తప్పదని మూర్తి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… మూర్తి మాదిరే కరోనాతో సహజీవనం చేయక తప్పదన్న మాటను ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట కూడా వినిపించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 30, 2020 12:12 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…