Political News

చాన్నాళ్ల తర్వాత తల్లి విజయమ్మను కలిసిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి తెలిసిందే. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదలాయింపు వివాదంలో తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలలు ఓ వర్గంగా నిలవగా..జగన్ తన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి మరో వర్గంగా నిలిచారు. ఇరు వర్గాలు షేర్ల బదలాయింపుపై ఏకంగా కోర్టుకు ఎక్కి మరీ వాదులాడుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా కాలంగా జగన్ తన తల్లి విజయమ్మతో కలిసిందే లేదు. తాజాగా మంగళవారం ఆయన తన తల్లి విజయమ్మను కలిశారు. కుమారుడిని చూసిన సంతోషంలో విజయమ్మ ఉప్పొంగిపోతే… తల్లి విజయమ్మను కలిసిన నేపథ్యంలో జగన్ కూ ఒకింత సాంత్వన లభించిందని చెప్పాలి.

తన చెల్లి వైఎస్ షర్మిలతో చాలా కాలంగా జగన్ కు రాజకీయ పరంగా విభేదాలు తలెత్తగా… వారిద్దరూ ఎడమొఖం పెడ మొఖంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య షర్మిల కుమారుడి వివాహం జరగ్గా… జగన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగానూ అన్నాచెల్లెళ్ల మధ్య పెద్దగా మాటలు కలవలేదు. అయితే అన్నాచెల్లెళ్లు ఎప్పటికైనా కలవకపోతారా అన్నట్లుగా విజయమ్మ ఇద్దరినీ సమానంగానూ చూసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే షేర్లపై షర్మిలతో జగన్ వాదులాటకు దిగారో… విజయమ్మ కూతురు వైపే నిలబడ్డారు. ఫలితంగా జగన్ తన తల్లికి దూరమైపోయారు. ఈ క్రమంలో చాలా కాలంగా ఆయన తన తల్లిని కలిసిందే లేదు.

ఇలాంటి నేపథ్యంలో సోమవారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసినంతనే.. హైదరాబాద్ లో తన కూతురుతో కలిసి ఉంటున్న విజయమ్మ సోమవారం రాత్రికే ప్రకాశం జిల్లాలోని వైవీ సొంతూరు మేదరమెట్ల చేరుకున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జగన్ కూడా మేదరమెట్ల వెళ్లి బాబాయి కుటుంబాన్ని పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం తర్వాత తన తల్లి విజయమ్మను చూశారు. చాన్నాళ్లకు కుమారుడు కనబడటంతో జగన్ ను విజయమ్మ అపురూపంగా చూసుకున్నారు. జగన్ కూడా తల్లి వద్దే నిలబడి..ఆమెతో మాట్లాడుతూ కనిపించారు. అక్కడి నుంచి వెనుదిరిగే సమయంలో ఆయన విజయమ్మ దీవెనలు తీసుకుని మరీ బయలుదేరారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి.

This post was last modified on March 18, 2025 4:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

1 hour ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago