Political News

చాన్నాళ్ల తర్వాత తల్లి విజయమ్మను కలిసిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి తెలిసిందే. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదలాయింపు వివాదంలో తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలలు ఓ వర్గంగా నిలవగా..జగన్ తన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి మరో వర్గంగా నిలిచారు. ఇరు వర్గాలు షేర్ల బదలాయింపుపై ఏకంగా కోర్టుకు ఎక్కి మరీ వాదులాడుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా కాలంగా జగన్ తన తల్లి విజయమ్మతో కలిసిందే లేదు. తాజాగా మంగళవారం ఆయన తన తల్లి విజయమ్మను కలిశారు. కుమారుడిని చూసిన సంతోషంలో విజయమ్మ ఉప్పొంగిపోతే… తల్లి విజయమ్మను కలిసిన నేపథ్యంలో జగన్ కూ ఒకింత సాంత్వన లభించిందని చెప్పాలి.

తన చెల్లి వైఎస్ షర్మిలతో చాలా కాలంగా జగన్ కు రాజకీయ పరంగా విభేదాలు తలెత్తగా… వారిద్దరూ ఎడమొఖం పెడ మొఖంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య షర్మిల కుమారుడి వివాహం జరగ్గా… జగన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగానూ అన్నాచెల్లెళ్ల మధ్య పెద్దగా మాటలు కలవలేదు. అయితే అన్నాచెల్లెళ్లు ఎప్పటికైనా కలవకపోతారా అన్నట్లుగా విజయమ్మ ఇద్దరినీ సమానంగానూ చూసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే షేర్లపై షర్మిలతో జగన్ వాదులాటకు దిగారో… విజయమ్మ కూతురు వైపే నిలబడ్డారు. ఫలితంగా జగన్ తన తల్లికి దూరమైపోయారు. ఈ క్రమంలో చాలా కాలంగా ఆయన తన తల్లిని కలిసిందే లేదు.

ఇలాంటి నేపథ్యంలో సోమవారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసినంతనే.. హైదరాబాద్ లో తన కూతురుతో కలిసి ఉంటున్న విజయమ్మ సోమవారం రాత్రికే ప్రకాశం జిల్లాలోని వైవీ సొంతూరు మేదరమెట్ల చేరుకున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జగన్ కూడా మేదరమెట్ల వెళ్లి బాబాయి కుటుంబాన్ని పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం తర్వాత తన తల్లి విజయమ్మను చూశారు. చాన్నాళ్లకు కుమారుడు కనబడటంతో జగన్ ను విజయమ్మ అపురూపంగా చూసుకున్నారు. జగన్ కూడా తల్లి వద్దే నిలబడి..ఆమెతో మాట్లాడుతూ కనిపించారు. అక్కడి నుంచి వెనుదిరిగే సమయంలో ఆయన విజయమ్మ దీవెనలు తీసుకుని మరీ బయలుదేరారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి.

This post was last modified on March 18, 2025 4:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

48 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago