టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగగా… దానికి హాజరైన పవన్… కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత… చంద్రబాబుతో విడిగా భేటీ అయ్యారు. వీరిద్దరు మాత్రమే ప్రత్యేకంగా భేటీ అయిన తీరుపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుందామని ఇదివరకే చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబుతో పవన్ భేటీ కావడంతో దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకేననే చర్చ జరుగుతోంది.
గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా… చంద్రబాబు, పవన్ లు సభ బయటకు వచ్చి అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఆఫీస్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. నాడు నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్బంగా పవన్ ప్రతిపాదనను తిరస్కరించిన చంద్రబాబు… నాగబాబును రాజ్యసభకు కాకుండా శాసన మండలికి పంపిద్దామని… ఆ తర్వాత ఆయనను నేరుగా కేబినెట్ లోకి తీసుకుందామని ప్రతిపాదించారు. బాబు ప్రతిపాదన నచ్చడంతో పవన్ అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. ఆ తర్వాత బాబు చెప్పినట్లుగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశం కల్పించారు. నాగబాబు ఏకగ్రీవంగా మండలికి ఎన్నిక కూడా అయ్యారు.
మరి బాబు చెప్పిన ప్రకారం నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాల్సి ఉంది కదా. అదే సమయంలో కేబినెట్ లో ఖాళీలు, పునర్వ్యస్థీకరణ వంటి అంశాలపై ఇప్పుడు జోరుగానే చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో కేబినెట్ భేటీ ముగియగానే.. బాబుతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటుగా ఆయనకు ఏ శాఖ కేటాయించాలి?.. మంత్రిమండలిలో మార్పులుచేర్పులపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల గురించి కూడా బాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on March 17, 2025 9:09 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…