టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు…కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పెద్దలతో వరుస భేటీలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏలో కీలక బాగస్వామిగా టీడీపీ కొనసాగుతున్నందున…ఏపీ కోసం చంద్రబాబు ఏం అడిగినా… ఇట్టే వచ్చి పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోమారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారన్న మాట విన్నంతనే… ఆ టూర్ పై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహం ఈ నెల 18న ఢిల్లీలో జరుగుతోందట. ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకే డిల్లీ వెళుతున్న చంద్రబాబు పనిలో పనిగా ఈ టూర్ లో అంందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆయా శాఖల వద్ద ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయించే దిశగా చంద్రబాబు కృషి చేయనున్నారు. ఇందులో భాగంగా వీలయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… ఓ ముఖ్యమైన పని కోసం త్వరలోనే ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు ఇటీవలే ప్లాన్ చేసుకున్నారు. ఆ పనిని ఈ టూర్ లోనే ముగిస్తే సరిపోలా అన్న దిశగానూ చంద్రబాబు సాగుతున్నట్లు సమాచారం. అదేంటంటే.. రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు దాదాపుగా కార్యరంగం సిద్ధమైపోయింది. ఈ పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమరావతి పనుల ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రదానితో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 16, 2025 10:00 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…