టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు…కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పెద్దలతో వరుస భేటీలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏలో కీలక బాగస్వామిగా టీడీపీ కొనసాగుతున్నందున…ఏపీ కోసం చంద్రబాబు ఏం అడిగినా… ఇట్టే వచ్చి పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోమారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారన్న మాట విన్నంతనే… ఆ టూర్ పై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహం ఈ నెల 18న ఢిల్లీలో జరుగుతోందట. ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకే డిల్లీ వెళుతున్న చంద్రబాబు పనిలో పనిగా ఈ టూర్ లో అంందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆయా శాఖల వద్ద ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయించే దిశగా చంద్రబాబు కృషి చేయనున్నారు. ఇందులో భాగంగా వీలయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… ఓ ముఖ్యమైన పని కోసం త్వరలోనే ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు ఇటీవలే ప్లాన్ చేసుకున్నారు. ఆ పనిని ఈ టూర్ లోనే ముగిస్తే సరిపోలా అన్న దిశగానూ చంద్రబాబు సాగుతున్నట్లు సమాచారం. అదేంటంటే.. రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు దాదాపుగా కార్యరంగం సిద్ధమైపోయింది. ఈ పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమరావతి పనుల ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రదానితో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 16, 2025 10:00 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…