Political News

రేవంత్ రెడ్డి సిసలైన స్టేట్స్ మన్!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా బోర్ కొట్టలేదంటే అతిశయోక్తి కాదేమో. ఓ వైపు ప్రతిపక్షంపై పదునైన విమర్శలు గుప్పిస్తూనే… కేంద్రంలో అధికారంలో ఉన్న మరో విపక్షానికి చెందిన నేతలను కలిస్తే తప్పేమిటని కూడా ఆయన చెప్పిన తీరు నిజంగానే అబ్బురపరచిందని చెప్పక తప్పదు.

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా… తాను వ్యవహరిస్తున్న తీరును ఆయన సమర్థించుకున్న తీరు నిజంగానే… ఆయనలోని రాజనీతీజ్ఞుడిని ఆయన బయటపెట్టేశారని చెప్పక తప్పదు. నిత్యం విమర్శలు చేసుకుంటూ వెళ్లడానికి తానేమీ ప్రతిపక్ష నేతను కాదన్న రేవంత్… తెలంగాణకు ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కూడా రేవంత్ ఏకంగా వార్నింగే ఇచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే క్మంలో శనివారం రేవంత్ రెడ్డి సభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. తొలుత తన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు ఓ రేంజిలో సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి… దమ్ముంటే ఏ అంశంపై అయినా చర్చకు రావాలని ఆయన విపక్షాలకు సవాల్ విసిరారు.

పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందని బీఆర్ఎస్ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో కూడా చర్చించేందుకు తాను సిద్ధమేననని ఆయన ప్రకటించారు. తనతో చర్చకు రావాలంటూ ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ సభకు ఎందుకు రారంటూ ఆయన కేసీఆర్ పై సెటైర్ల వర్షం కురిపించారు.

అనంతరం తన ఢిల్లీ టూర్లపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన రేవంత్… గడచిన 15 నెలల్లో తాను 32 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. 300 సార్లు కూడా ఢిల్లీ వెళతానని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన పర్యటనల వివరాలు చేతబట్టిన రేవంత్… తాను ఢిల్లీకి వెళ్లేది గోటీలు ఆడుకోవడానికా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళుతున్న తాను.. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలను రాబడుతున్నానని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇప్పటిదాకా 3 సార్లు కలిశానని తెలిపారు. దేశ ప్రధానిగా ఉన్న మోదీ అన్ని రాష్ట్రాలకు బడే భాయేనని కూడా ఆయన అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో తప్పేముందని కూడా ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర కేబినెట్ లోని అందరు మంత్రులను తాను కలిశానని రేవంత్ చెప్పారు. చివరకు తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా తాను కలిశానని తెలిపారు. తాను కలవని కేంద్ర మంత్రి మోదీ కేబినెట్ లోనే లేరని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రులతో బేటీల సందర్భంగా రాష్ట్రానికి ఏమేం తీసుకువచ్చానన్న విషయాన్ని కూడా ఆయన సమగ్ర వివరాలను చదివి వినిపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే అయినా.. ప్రధానిగా మోదీ మాత్రం దేశం మొత్తానికి ప్రధాని అని తెలిపారు. రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే… విధాన పరంగా బీజేపీని వ్యతిరేకిస్తాను గానీ.. అభివృద్ధి విషయంలో కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం, వారికి దూరంగా మసలుకోవడం తగదన్నారు. తాను కూడా ఇదే చేస్తున్నానని చెప్పిన రేవంత్ రెడ్డి… తాను చేస్తున్నది ముమ్మాటికీ కరెక్టేనని చెప్పుకొచ్చారు.

This post was last modified on March 15, 2025 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

3 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

8 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

9 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

9 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

9 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

10 hours ago