Political News

ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలకు ‘కూటమి’ అవార్డులు

ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకునే ఈ నిర్ణయం ద్వారా ఉత్తమ పనితీరు కనబరచిన ప్రజా ప్రతినిధులకు అవార్డులు ఇవ్వనుంది. తద్వారా మరింత మంది ప్రజా ప్రతినిధుల పనితీరును మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు శనివారం ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు చెందిన ప్రజలకు మరింత చేరువ అవుతారని… ఫలితంగా ఆయా ప్రాంతాల సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన కూటమి… టీడీపీ, జనసేన, బీజేపీల కలయికతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరికొత్త విధానాలతో సాగుతున్న కూటమి సర్కారు.. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఏ కార్యక్రమం చేపట్టినా…. అంతిమంగా రాష్ట్ర ప్రజలకు ఏ మేర మేలు జరుగుతుందన్న దానినే గీటురాయిగా పరిగణిస్తూ సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో మరింత లోతుగా వెళ్లగలిగితే… ఫలితాలు అద్బుతంగా ఉంటాయన్న బావనతో ఈ కొత్త కార్యక్రమానికి తెర తీసినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా వాటిని ఇటు అసెంబ్లీలోనే.. అటు పార్లమెంటులోనో ప్రస్తావించడం ద్వారా… వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం, ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాల ఆధారంగా ఉత్తమ లెజిస్లేటర్ పేరిట ఎమ్మెల్యేలకు, ఉత్తమ పార్లమెంటేరియన్ పేరిట పార్లమెంటు సభ్యులకు అవార్డులను అందించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు ఆధారంగానే అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డుల ఎంపిక కోసం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ కమిటీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఉత్తమ ప్రజా ప్రతినిధులను ఎంపిక చేయనుంది.

Satya

Recent Posts

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

13 minutes ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

51 minutes ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

2 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

3 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

3 hours ago

నోలన్ విధ్వంసానికి ఆకాశమే హద్దు

ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…

4 hours ago