Political News

జగన్ నా ఆస్తులను లాక్కున్నారు: బాలినేని

జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా వైసీపీలోనే కొనసాగిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం చిత్రాడలో జరిగిన జయకేతనం సభకు హాజరైన సందర్భంగా ప్రసంగించిన బాలినేని… జగన్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తులను కూడా జగన్ లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయం గురించి చెప్పాలంటే..ఈ సమయం సరిపోదని, తర్వాత సమయం వచ్చినప్పుడు జగన్ తనకు చేసిన అన్యాయం గురించి సవివరంగా చెబుతానని ఆయన అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన తాను సగం ఆస్తులను అమ్మేసుకున్నానని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా జగన్ తనకు లైఫ్ ఇచ్చిన మాట వాస్తవమేనన్న బాలినేని… అందుకే జగన్ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేశానని తెలిపారు. అయినా జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని ఓ సారి సీఎం కాగలిగారన్నారు. ఇక మరోమారు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని బాలినేని చెప్పారు. అయితే పవన్… జగన్ మాదిరిగా కాదన్నారు. స్వశక్తితో పార్టీని పెట్టిన పవన్… తన సొంతంగానే అధికారంలోకి వచ్చారన్నారు. పవన్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే… జనసేనలో తన చేరిక గురించి కూడా బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబు ఆహ్వానం మేరకే తాను జనసేనలో చేరానని తెలిపారు. జనసేనలో చేరినప్పుడు తాను పదవులను అడగలేదని ఆయన చెప్పారు. అయితే పవన్ ను తాను ఓ రిక్వెస్ట్ చేశానన్నారు. పవన్ తో తాను ఓ సినిమా తీయాలనుకుంటున్నానని… ఆ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరానని తెలిపారు. అందుకు పవన్ కూడా ఓకే చెప్పారని…త్వరలోనే తాను పవన్ తో ఓ సినిమాను నిర్మిస్తానని బాలినేని చెప్పుకొచ్చారు.

This post was last modified on March 14, 2025 9:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓజీకే ఊగిపోతుంటే.. ఉస్తాద్‌ కూడానట

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…

23 minutes ago

సినీ పితామహుడుగా జూనియర్ ఎన్టీఆర్ ?

ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…

1 hour ago

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…

2 hours ago

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…

2 hours ago

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన…

2 hours ago

ఉన్నది ఇద్దరే!.. ప్రాధాన్యం ఎనలేనిదే!

నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…

2 hours ago