Political News

వైసీపీతో బంధం వద్దు… సంక్షేమంలో వివక్ష వద్దు

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హోలీ వేళ… కీలక సూచనలు చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో బంధాలు వద్దని ఆయన టీడీపీ శ్రేణులకు సూచించారు. వైసీపీతో బంధాన్ని ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన దాదాపుగా హెచ్చరికలు జారీ చేశారు. ఏదో చిన్నస్థాయి కదా అనుకుంటే… వైసీపీ నేతలో బంధాలు నెరపిన వారికి కఠిన దండన తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఇక సంక్షేమ పథకాల అమలులో వివక్షకు అసలు ఎంతమాత్రం కూడా చోటు ఇవ్వవద్దని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. ఏ పథకం అయినా.. అర్హతే ప్రామాణికంగా సాగాలని కూడా ఆయన సూచించారు. ఈ విషయంలో పార్టీ, కులం, ప్రాంతం అన్న తేడాలను చూడొద్దన్నారు. పథకాల అమలులో ఫలానా పార్టీ వారైతే పథకాలు రావు అన్న భావనే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలకు,…రాజకీయ సంబంధాలకు చాలా తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విభజన రేఖను టీడీపీ నేతలు జాగ్రత్తగా గమనించుకుంటూ సాగాలని సూచించారు.

ఇక కూటమిలోని మిత్రపక్షాలకు చెందిన నేతలతో సఖ్యతగా మెలగాలని కూడా చంద్రబాబు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్ని కార్యక్రమాల్లో మిత్రపక్షాల నేతలను కలుపుకుని వెళ్లాలని… మిత్రపక్షాల నేతలతో పొరపొచ్చాలు, అరమరికలు లేకుండా సాగితేనే కూటమికి బలం అన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. మూడు పార్టీలకు చెందిన నేతల మధ్య ఐక్యత ఉంటే… కూటమిని ఓడించే శక్తి మరెవరికీ లేదని కూడా ఆయన అన్నారు. జనసేన, బీజేపీ నేతలతో కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చినా.. కూటమి ఐక్యతను గుర్తుంచుకుని టీడీపీ శ్రేణులు ముందుకు సాగాల్సి ఉందని ఆయన సూచించారు.

ఇక పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని చంద్రబాబు అన్నారు. పార్టీలో ఇప్పుడు పదవులు రాకుంటే…మరో రెండేళ్లకైనా అవకాశం దక్కుతుంది… అప్పటికీ దక్కకున్నా…ఆ తర్వాతైనా దక్కుతుంది అన్న భావనతో సాగాలని ఆయన సూచించారు. పార్టీ కోసం నియోజకవర్గాల వారీగా నిస్వార్థంగా సేవలు చేసిన వారి జాబితాలను ఇంకా చాలా మంది నేతలు పంపలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డవారి కోసం ప్రస్తుతం 21 ఆలయాల ట్రస్టు బోర్టు చైర్మన్ పదవులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని.. పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఆ పదవులు దక్కుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on March 14, 2025 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago