కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా… వాటి ద్వారా దాదాపుగా రాష్ట్ర యువతకు 4 లక్షల మేర ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తాజాగా గురువారం జరిగిన నాలుగో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం మరిన్ని పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పెట్టుబడుల్లో ఏపీ నుంచి వైసీపీ దెబ్డకు పారిపోయిన లులూ గ్రూప్ తిరిగి ఏపీలోకి ప్రవేశించనుంది. అదే సమయంలో కొత్తగా సిమెంట్ రంగంలో దేశంలోనే పేరెన్నికగన్న కంపెనీగా గుర్తింపు పొందిన దాల్మియా కంపెనీ రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది.
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నాలుగో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రూ.1,21,659 కోట్ల మేర పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలోకి మొత్తంగా 10 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు 80,104 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వీటితో పాటుగా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
ఇక రాష్ట్ర యువతకు వివిద రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటుకు కూదా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం నెల వ్యవధిలోనే రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు తీర్మానించారు. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఆయా రంగాల్లో శిక్షణలతో పాటుగా ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. ఇక విశాఖలో భారీ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్ రూ.1,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. అదే సమయంలో కడప జిల్లాలో దాల్మియా స్టీల్స్ కంపెనీ ఓ బారీ సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది.
This post was last modified on March 14, 2025 8:56 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…