బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా వివాదాలతోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసుకుని ఆయన వ్యాఖ్యలు సంధిస్తారు. అయితే.. ఈ సారి మాత్రం సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. బీజేపీలో పాత సామాన్లు అంటూ.. సంచలన విమర్శలు చేశారు.
బీజేపీలో పాత సామాన్లు పెరిగిపోతున్నాయి. వీటిని చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం వచ్చింది. ఎవరికి వారు గొప్పులు పోతున్నారు. వీరివల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా అని సీనియర్ నాయకులను ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పేరు బయటకు చెప్పకపోయినా.. రాష్ట్ర బీజేపీ సారథి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజా సింగ్ చాలా కాలంగా విభేదిస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన గురించేనన్న చర్చ వినిపిస్తోంది.
అంతేకాదు.. బీజేపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న రాజా సింగ్.. కొత్త వారికి అవకాశం ఇవ్వాల ని సూచించారు. లేకపోతే.. బూజుపట్టి తప్పు కంపు కొడుతుందన్నారు. అయితే.. తాను ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. పార్టీ మేలు కోరి చెబుతున్నానని ఆయన తెలిపారు. పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలా కాకుంటే.. పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధిష్టానం ఏం చేస్తోందో నాకు తెలియదు. కానీ, ఆలోచన చేయాలని మాత్రం చెబుతున్నారు. ఎవరికి వారు గొప్ప వాళ్లుగా చలామణి అయితే.. కొత్తవారికి అవకాశం ఎప్పుడు ఇస్తారు. ఎప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ విషయంపై అధిష్టానం దృష్టి పెట్టాలి. పాతవారిని బలవంతంగా అయినా.. రిటైర్ చేయించాలి. అప్పుడు మాత్రమే పార్టికి మనగడ ఉంటుంది అని రాజాసింగ్ చెప్పారు.
This post was last modified on March 13, 2025 6:43 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…