బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా వివాదాలతోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసుకుని ఆయన వ్యాఖ్యలు సంధిస్తారు. అయితే.. ఈ సారి మాత్రం సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. బీజేపీలో పాత సామాన్లు అంటూ.. సంచలన విమర్శలు చేశారు.
బీజేపీలో పాత సామాన్లు పెరిగిపోతున్నాయి. వీటిని చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం వచ్చింది. ఎవరికి వారు గొప్పులు పోతున్నారు. వీరివల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా అని సీనియర్ నాయకులను ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పేరు బయటకు చెప్పకపోయినా.. రాష్ట్ర బీజేపీ సారథి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజా సింగ్ చాలా కాలంగా విభేదిస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన గురించేనన్న చర్చ వినిపిస్తోంది.
అంతేకాదు.. బీజేపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న రాజా సింగ్.. కొత్త వారికి అవకాశం ఇవ్వాల ని సూచించారు. లేకపోతే.. బూజుపట్టి తప్పు కంపు కొడుతుందన్నారు. అయితే.. తాను ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. పార్టీ మేలు కోరి చెబుతున్నానని ఆయన తెలిపారు. పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలా కాకుంటే.. పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధిష్టానం ఏం చేస్తోందో నాకు తెలియదు. కానీ, ఆలోచన చేయాలని మాత్రం చెబుతున్నారు. ఎవరికి వారు గొప్ప వాళ్లుగా చలామణి అయితే.. కొత్తవారికి అవకాశం ఎప్పుడు ఇస్తారు. ఎప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ విషయంపై అధిష్టానం దృష్టి పెట్టాలి. పాతవారిని బలవంతంగా అయినా.. రిటైర్ చేయించాలి. అప్పుడు మాత్రమే పార్టికి మనగడ ఉంటుంది అని రాజాసింగ్ చెప్పారు.
This post was last modified on March 13, 2025 6:43 pm
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…
గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…