బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా వివాదాలతోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసుకుని ఆయన వ్యాఖ్యలు సంధిస్తారు. అయితే.. ఈ సారి మాత్రం సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. బీజేపీలో పాత సామాన్లు అంటూ.. సంచలన విమర్శలు చేశారు.
బీజేపీలో పాత సామాన్లు పెరిగిపోతున్నాయి. వీటిని చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం వచ్చింది. ఎవరికి వారు గొప్పులు పోతున్నారు. వీరివల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా అని సీనియర్ నాయకులను ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పేరు బయటకు చెప్పకపోయినా.. రాష్ట్ర బీజేపీ సారథి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజా సింగ్ చాలా కాలంగా విభేదిస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన గురించేనన్న చర్చ వినిపిస్తోంది.
అంతేకాదు.. బీజేపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న రాజా సింగ్.. కొత్త వారికి అవకాశం ఇవ్వాల ని సూచించారు. లేకపోతే.. బూజుపట్టి తప్పు కంపు కొడుతుందన్నారు. అయితే.. తాను ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. పార్టీ మేలు కోరి చెబుతున్నానని ఆయన తెలిపారు. పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలా కాకుంటే.. పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధిష్టానం ఏం చేస్తోందో నాకు తెలియదు. కానీ, ఆలోచన చేయాలని మాత్రం చెబుతున్నారు. ఎవరికి వారు గొప్ప వాళ్లుగా చలామణి అయితే.. కొత్తవారికి అవకాశం ఎప్పుడు ఇస్తారు. ఎప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ విషయంపై అధిష్టానం దృష్టి పెట్టాలి. పాతవారిని బలవంతంగా అయినా.. రిటైర్ చేయించాలి. అప్పుడు మాత్రమే పార్టికి మనగడ ఉంటుంది అని రాజాసింగ్ చెప్పారు.
This post was last modified on March 13, 2025 6:43 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…