Political News

లోకేశ్ మాటిచ్చారంటే.. ఇలాగే ఉంటుంది

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఒక్కసారి మాటిచ్చారా? ఇక ఆ పని అయిపోయినట్టే. వాయిదా ఉండదు. జాప్యం అసలే ఉండదు. యుద్ధ ప్రాతిపదికన అంటాం కదా.. అలా గంటల వ్యవధిలోనే సదరు పనిని పూర్తి చేసే కార్యాచరణ ప్రారంభమైపోతుంది. అంతేనా… సదరు పని లోకేశ్ నిర్దేశించిన సమయంలోగానే పూర్తి అయి తీరుతుంది. అలా ఎందుకు అవుతుందంటే.. దానిపై లోకేశ్ అనుక్షణం ఓ కన్నేసి ఉంచుతారు కాబట్టి. నిజమే… అటవీ శాఖాధికారులు కూల్చేసిన కాశినాయన ఆశ్రమ పునర్ నిర్మాణ పనులను చూస్తే ఈ మాట నిజమేనని చెప్పక తప్పుదు.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని నల్లమల అడవుల్లో కొనసాగుతున్న శ్రీ కాశినాయన అన్నదాన సత్రం కూల్చివేతపై లోకేశ్ వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. అటవీ శాఖ అధికారులు చేసిన పొరపాటుకు లోకేశ్ క్షమాపణలు చెప్పారు. అంతేనా… కాశినాయన ఆశ్రమాన్ని తన సొంత నిధులతో పునర్ నిర్మాస్తానని కూడా బుధవారం హామీ ఇచ్చారు. టైగర్ రిజర్వ్ జోన్ లో ఉందంటూ ఆ ఆశ్రమంలోని కొన్ని భవనాలను అటవీ శాఖ అధికారులు తొలగించారు. అయితే వేలాది మందికి నిత్యం అన్నదానం చేస్తున్న సదరు సత్రాన్ని తొలగించే దిశగా కుట్ర జరుగుతోందన్న ప్రచారంపై లోకేశ్ వేగంగా స్పందించి… పరిస్థితిని చక్కదిద్దారు.

సత్రంలో అటవీ శాఖ అధికారులు కూల్చేసిన భవనాలను తన సొంత నిధులతో నిర్మించి ఇస్తానని బుధవారం ప్రకటించిన లోకేశ్… వెనువెంటనే రంగంలోెకి దిగిపోయారు. బుధవారం రాత్రికే తన బృందాన్ని బద్వేలు పంపిన లోకేశ్… సత్రం భవనాల నిర్మాణాలకు అవసరమైన చర్యలను ప్రారంభించారు. పలితంగా గురువారం ఉదయానికే కాశినాయన సత్రంలో భవనాల నిర్మాణ పనులు ప్రారంభమై పోయాయి. భవన నిర్మాణాల కోసం మార్కింగ్ ప్రక్రియ పూర్తి కాగా… గురువారం మధ్యాహ్నానికి మట్టి తవ్వకాలు మొదలు కానున్నాయి. ఆ వెంటనే భవన నిర్మాణాలు కూడా శరవేగంగానే పూర్తి కానున్నాయి.

This post was last modified on March 13, 2025 11:08 am

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

6 hours ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

6 hours ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

6 hours ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

7 hours ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

9 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

9 hours ago