Political News

బోరుమంటూ ఏడ్చేసినా బెయిల్ దక్కలేదు

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని సీఐడీ పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి గుంటూరు కోర్టులో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు బెయిల్ ఇవ్వాల్సిందేనని… లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ పోసాని… న్యాయమూర్తి ముందు బోరుమంటూ విలపించారు. కళ్లల్లో కన్నీళ్లు ధారగా కారుతుండగా…తన పరిస్థితిని ఆయన న్యాయమూర్తి ముందు విన్నవించారు. అయితే పోసానికి బెయిల్ ఇవ్వరాదంటూ సీఐడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి… పోసానికి 14 రోజుల రిమాండ్ ను విధించారు.

ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లోని చిక్కులు వీడిపోయాయని..ఇక తాను జైలు నుంచి విడుదల అవుతున్నానని పోసాని మంగళవారం రాత్రి భావించారు. అయితే బుధవారం ఉదయానికంతా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు గుంటూరు సీఐడీ పోలీసులు పోసానిపై 5 నెలల క్రితం ఓ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్ తీసుకుని బుధవారం ఉదయానికంతా పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలు ముందు వారు ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే పోసానిని వర్చువల్ గా కర్నూలు న్యాయమూర్తి ముందు హాజరు పరచి పోసానిని తమ అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు.

ఈలోగా వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ముందు పొన్నవోలు వాదనలు చెల్లుబాటు కాలేదు. దీంతో ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అప్పటికే కర్నూలు నుంచి గుంటూరు చేరుకున్న సీఐఢీ అధికారులు… పోసానిని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ పొన్నవోలు నేతృత్వంలోని న్యాయవాదుల బృందం తమ వాదనలను వినిపించింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 పోసానికి వర్తించదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే పోసాని చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు.

ఈ క్రమంలో అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉన్న పోసాని ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. న్యాయమూర్తి ముందు పోసాని కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆరోగ్యం ఏమీ బాగోలేదని, తనకు ఇప్పటికే రెండు ఆపరేషన్లు అయ్యాయని ఆయన జడ్జికి చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే తన తల నరికేయండని కూడా పోసాని వ్యాఖ్యానించారు. తనకు బెయిల్ ఇవ్వాల్సిందేనని… లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని కూడా పోసాని జడ్జీ ముందు విలపించారు. పోసాని వాదనను విన్న న్యాయమూర్తి వాదనలు పూర్తి అయ్యాయని చెప్పి అందరినీ బయటకు పంపారు. ఆ తర్వాత ఇరు వర్గాల వాదనలను మరోమారు పరిశీలించిన న్యాయమూర్తి… పోసానికి 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో పోసానిని పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

Kumar

Recent Posts

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు…

52 minutes ago

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

2 hours ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

4 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

4 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

5 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

5 hours ago