Political News

సాయిరెడ్డిపైనా వైసీపీ దాడి షురూ!

వైసీపీ భవిష్యత్తు కోసం సలహాలు, సూచనలు ఇచ్చే వారిని ఆ పార్టీ నేతలు ఓ రకమైన దృష్టితో చూస్తుండటం అందరికీ తెలిసిందే. ఈ సలహాలు, సూచనలు తమకు అనుకూలంగా ఉన్నంత వరకు ఓకే… అవే సలహాలు తమను కాస్తంత ఇబ్బంది పెట్టాయన్న ఫీలింగ్ వచ్చిందంటే.. వైసీపీకి చెందిన నేతలు వరుసబెట్టి మరీ ఎదురు దాడికి దిగుతారు. అలాంటిది మొన్నటిదాకా వైసీపీలో ఓ కీలక నేతగా కొనసాగి… ఆపై రాజకీయాలనే వదిలేసి వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి చెందిన కీలక నేతలను ఓ కోటరీగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకే సాయిరెడ్డిపై వైసీపీ నేతల ఎదురు దాడి మొదలైపోయింది.

వైసీపీ పతనానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ విస్తరించి ఉన్న కోటరీనేనని సాయిరెడ్డి బుధవారం మధ్యాహ్నం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు వాటాల బదలాయింపునకు సంబంధించిన కేసులో సీఐడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి…విచారణ అనంతరం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డి కనుసన్నల్లోనే వాటాల విక్రయం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా జగన్ చుట్టూ చేరిన కోటరీ కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడిందని చెప్పారు. కోటరీని దూరం పెట్టకుంటే జగన్ కు భవిష్యత్తే లేదని కూడా ఆయన తేల్చి పారేశారు.

ఈ మాటలు విన్నంతనే… పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్న విషయాన్నీ మరిచిన వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా ముందుకు వచ్చారు. సీఐడీ విచారణ అనేది ఓ బూటకమని… విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారని ఆయన విరుచుకుపడ్డారు. సుబ్బారెడ్డి, కేవీ రావుల మధ్య ఎలాంటి సంబంధాలు లేవన్న సుధాకర్ బాబు.. ఇద్దరి మధ్య సంబంధాలుంటే.. కేవీ రావు ఎందుకు కేసు వేశారని ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను సాయిరెడ్డి చదివారని ఆరోపించారు. వైసీపీ ద్వారా ఎదిగిన సాయిరెడ్డి.. పార్టీ అదినేత కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్లారని మండిపడ్డారు. జగన్ అంటే గిట్టని రఘురామకృష్ణరాజుకు సాయిరెడ్డి తన ఇంటికి ఎందుకు అద్దెకు ఇచ్చారని ప్రశ్నించారు. సాయిరెడ్డి పదే పదే కోటరీ అని మాట్లాడుతున్నారన్న ఆయన.. సాయిరెడ్డే ఎంతో మంది నేతలను జగన్ కు పరిచయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు సాయిరెడ్డిని మించిన కోటరీ ఏముంటుందని కూడా ఆయన ప్రశ్నించారు.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

2 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

2 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

2 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

3 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

3 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

4 hours ago