తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు అధికార, విపక్షాల సభ్యులంతా దాదాపుగా హాజరయ్యారు. చాలా కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బుధవారం నాటి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును చూసిన వెంటనే… మొన్నామధ్య ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార సరళి ఠక్కున గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే కేసీఆర్, జగన్ కు ఎంత తేడా ఉందో చూశారా? అన్న మాటలు కూడా వినిపించాయి.
పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ ముఖమే చూడని జగన్… తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా సభ గడప తొక్కనీయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే నిర్దేశిత రోజుల పాటు సభకు రాకపోతే… అనర్హత వేటు తప్పదన్న అధికార కూటమి నేతల మాటలతో మొన్నటి బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సభకు వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. సభకు వచ్చి అటెండెన్స్ బుక్ లో సంతకం చేసి… తద్వారా సస్పెన్షన్ వేటును తప్పించుకునేందుకే అసెంబ్లీకి వచ్చినట్లుగా జగన్ తన వైఖరితోనే చెప్పేసినట్టైంది. ఆపై సభకు వచ్చేది లేదని.. ఇందుకు కారణం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడమేనని కూడా జగన్ ప్రకటించారు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ హుందాగా సభకు వచ్చారు. మంగళవారమే బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన బీఆర్ఎస్ఎల్పీ భేటీని కూడా ఆయన నిర్వహించారు. ఇక బుధవారం ఉదయం నిర్దేశిత సమయానికే ఆయన అసెంబ్లీకి చేరుకుని… బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మరోమారు తన పార్టీ సభ్యులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్టుదేవ్ శర్మ ప్రసంగిస్తున్నంత సేపు కేసీఆర్ ఆ ప్రసంగాన్ని విన్నారు. కొన్ని కీలక అంశాలను గవర్నర్ ప్రస్తావిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేసినా… గవర్నర్ ప్రసంగాన్ని కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులంతా సాంతం విన్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడగా… కేసీఆర్ ఇతర సభ్యులతో కలిసి సభ నుంచి వెళ్లిపోయారు. వెరసి అనుభవశీలిగా కేసీఆర్ వ్యవహరిస్తే… జగన్ మాత్రం దుందుడుకు తత్వంతో వ్యవహరించారన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…