Political News

ప్రభుత్వం తరఫున లోకేశ్ క్షమాపణలు

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం ప్రభుత్వానికి తెలిసే జరిగే అవకాశాలు తక్కువ. కొన్ని విషయాలు ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఏ మాత్రం సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి. అయినప్పటకీ, ఆ ఘటనలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తుంటాయి. ఇటువంటి క్రమంలో ఆ ఘటనను ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నదానిపై డ్యామేజ్ కంట్రోల్ ఉంటుంది. తాజాగా ఏపీలో జరిగిన ఈ తరహా ఘటనను సంబంధించి మంత్రి లోకేశ్ హ్యాండిల్ చేసిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా ప్రభుత్వం తరఫున లోకేశ్ క్షమాపణలు చెప్పిన తీరు ఎంతోమంది యువనేతలకు ఆదర్శంగా నిలిచింది.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని శ్రీ కాశినాయన అన్నదాన సత్రం కూల్చివేత వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాశి నాయన అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించిన ఆ చోట పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అయితే, ఆ ప్రాంతం టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని హఠాత్తుగా అటవీ శాఖ అధికారులు కొన్ని భవనాలను కూల్చివేశారు. దీంతో, నిత్యం అన్నదానం జరిపి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న ఈ సత్రం కూల్చడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త ఒకరు ‘ఎక్స్’ ద్వారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, విషయం తెలుసుకున్న లోకేశ్ తక్షణం స్పందించారు.

ఆ అన్నదాన సత్రం కూల్చివేతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన లోకేశ్….ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, కూల్చిన చోటే తన సొంత డబ్బులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని హామీనిచ్చారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని కూడా హామీనిచ్చారు.

This post was last modified on March 12, 2025 1:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nara Lokesh

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

9 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

10 hours ago