Political News

పోసాని రిలీజ్ ఇప్పుడప్పుడే కాదు

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఇప్పుడప్పుడే జైలు నుంచి విముక్తి కలిగేలా లేదు. ఇప్పటికే నాలుగు కోర్టుల నుంచి బెయిల్ లభించడంతో బుధవారం పోసాని రిలీజ్ అవుతారని అంతా అనుకున్నా.. బుధవారం ఉదయం ఊహించని రీతిలో ఏపీ సీఐడీ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సిన పోసాని… బుధవారం మధ్యాహ్నంలోగా సీఐడీ పోలీసుల అదుపులోకి వెళ్లనున్నారు. వెరసి పోసాని రిలీజ్ ఇప్పుడప్పుడే ఉండదని చెప్పక తప్పదు. పోసానికి నాలుగు కేసుల్లో బెయిల్ రాగా…మరో నాలుగు కేసుల్లో పోసానిని అరెస్ట్ చేయకుండా స్టేట్ మెంట్లు రికార్డు చేయాలని హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే పోసానిపై మొత్తంగా 16 కేసులు నమోదు అయి ఉన్నాయి కదా. మిగిలిన కేసుల్లో ఏదో ఒకటి ఓపెన్ అయిపోతూనే ఉంటుంది. ఫలితంగా పోసాని మరింత కాలం పాటు జైలులోనే ఉండక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబాలపైనా అసభ్య పదజాలంతో కూడిన దూషణలకు దిగారంటూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 16 దాకా పోలీసు కేసులు నమోదు అయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదు అయిన కేసులో రాజంపేట పోలీసులు గత నెల హైదరాబాద్ కు వెళ్లి మరీ పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టు రిమాండ్ కు ఆదేశించగా… పోలీసులు రాజంపేట జైలుకు తరలించారు. అక్కడికి వచ్చిన నరసరావు పేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఆపై గుంటూరు జైలుకు వెళ్లిన పోసానిని ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు.

ఈ కేసుల్లో ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని, విజయవాడ కోర్టుల్లోనూ ఆయనకు బెయిళ్లు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని… కోర్టు నిర్దేశించిన మేరకు జామీనులు సమర్పించి బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని మంగళవారం రాత్రి పలు కథనాలు వినిపించాయి. అనారోగ్యంతో సతమతం అవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పోసానికి ఎట్టకేలకు కాస్త ఊరట లభించిందన్న వాదనలు వినిపించాయి.

అయితే ఊహించని విధంగా గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరిన సీఐడీ అధికారులు బుధవారం ఉదయానికంతా కర్నూలు జిల్లా జైలు వద్ద ప్రత్యక్షమయ్యారు. పోసానిపై వారు పీటీ వారెంట్ ను జైలు అధికారులకు అందజేశారు. అంతేకాకుండా జైలు నుంచే పోసానిని కర్నూలు జిల్లా కోర్టులో వర్చువల్ గా హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేశారు. అంటే… వర్చువల్ గా జైలు నుంచే పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్న సీఐడీ అధికారులు.. కోర్టు అనుమతితో పీటీ వారెంట్ పై తమ అదుపులోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆయనను గుంటూరు తరలించే అవకాశాలున్నట్లు సమాచారం.

Kumar

Recent Posts

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

2 hours ago

పుష్ప విలన్ కామెడీ చేస్తే…

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…

3 hours ago

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…

3 hours ago

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…

3 hours ago

కర్ణుడి కాంట్రావర్సి… కల్కి దర్శకుడి కౌంటర్

విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…

4 hours ago

పైరసీని నిలువరించడం సాధ్యమవుతుందా

ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…

5 hours ago