Political News

ఒకే రోజు రెండు బెయిళ్లు… రేపు పోసాని విడుదల

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని, విజయవాడ కోర్టుల్లోనూ ఆయనకు బెయిళ్లు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని… కోర్టు నిర్దేశించిన మేరకు జామీనులు సమర్పించి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో సతమతం అవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పోసానికి ఎట్టకేలకు కాస్తంత ఊరట లభించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబాలపైనా అసభ్య పదజాలంతో కూడిన దూషణలకు దిగారంటూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 16 దాకా పోలీసు కేసులు నమోదు అయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదు అయిన కేసులో రాజంపేట పోలీసులు గత నెల హైదరాబాద్ కు వెళ్లి మరీ పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టు రిమాండ్ కు ఆదేశించగా… పోలీసులు రాజంపేట జైలుకు తరలించారు. అక్కడికి వచ్చిన నరసరావు పేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఆపై గుంటూరు జైలుకు వెళ్లిన పోసానిని ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు.

అయితే ఎక్కడికక్కడ కేసులు నమోదు కావడంతో ఆయా కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ వచ్చిన పోసాని.. నేరుగా హైకోర్టులోనూ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ క్రమంలో తొలుత రాజంపేట కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే పోసాని వేరే జిల్లాల పోలీసుల అదుపులోకి వెళ్లిపోయిన నేపథ్యంలో జైలు నుంచి విడుదల సాధ్యం కాలేదు. సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కోర్టు కూడా పోసానికి బెయిల్ మంజూరు చేసింది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కోర్టులు రెండే ఒకే రోజు బెయిల్ మంజూరు చేశాయి. ఇక మిగిలిన కేసుల్లో పోసానికి నోటీసులు ఇచ్చి స్టేట్ మెంట్లు రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 4 కోర్టుల్లో బెయిల్ తెచ్చుకున్న పోసాని.. ఆయా కోర్టులు పేర్కొన్న మేరకు జామీనులు సమర్పించి బుధవారం కర్నూలు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

This post was last modified on March 11, 2025 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

7 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

7 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

7 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

7 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

8 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

9 hours ago