ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వ పాఠశాలల తీరును మార్చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఐడియాలతో పాఠశాల విద్యపై కసరత్తు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యార్థుల తరహాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించేవారు కూడా ఉండాలని భావించారు. మెడలో టై, పాదాలకు పాలిష్డ్ బూట్లు, చూడగానే ఆకర్షించేలా ఉండే.. డ్రస్ కోడ్.. వంటివి ఇప్పుడు అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ను మంత్రి సెలక్ట్ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం(జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. కొత్త యూనిఫా మ్లకు తాజాగా మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించారు. అదేవిధంగా ఏదో ఇచ్చామంటే ఇచ్చామని అన్నట్టుగా కాకుండా.. మొక్కుబడి తంతుకు ఫుల్ స్టాప్ పెట్టి.. మనస్పూర్తిగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే ఆకర్షించే కలర్స్ ఉన్న వస్త్రాలను ఎంపిక చేశారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ప్రభుత్వం అందించ నుంది. అందరికీ ఒకే రోజు ఇచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. కాగా.. ఈ పథకాన్ని గతంలో వైసీపీ ప్రారంభించింది. కార్పొరేట్ స్కూళ్లకు పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దాలని నిర్ణయిం చింది. అనుకున్న లక్ష్య సాధనలో కొంత మేరకు దూకుడు చూపించినా.. జగన్ పర్యవేక్షణ లోపించడం.. మధ్యలో కొందరు నాయకుల జోక్యంతో ఈ కార్యక్రమం వైసీపీకి పెద్దగా పేరు తీసుకురాకపోవడం గమనార్హం.
This post was last modified on March 11, 2025 6:09 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…