Political News

2018 ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. అతనికి ఉరిశిక్ష

తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కుల వివక్షపై చర్చకు దారి తీసింది. ప్రణయ్ ను అతని భార్య అమృత కళ్ల ఎదుటే సుఫారీ గ్యాంగ్‌తో మారుతీరావు ప్లాన్ చేసి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. న్యాయస్థానం ఈ కేసులో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ (ఏ-2) కు ఉరిశిక్ష విధించగా, మిగతా నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.

ప్రణయ్, అమృత వివాహాన్ని అంగీకరించని ఆమె తండ్రి మారుతీరావు ఈ హత్యను పథకం ప్రకారం జరిపించినట్టు విచారణలో నిర్ధారణకు వచ్చింది. హత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో 1600 పేజీల చార్జ్‌షీట్ రూపొందించబడింది. నిందితులుగా పేర్కొన్న ఎనిమిది మందిలో ప్రధాన కుట్రదారి మారుతీరావు (ఏ-1) 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నిందితులు సుబాష్ శర్మ, అజ్గర్ అలీ, అబ్ధుల్ బారీ, కరీం, శ్రవణ్ కుమార్, శివ, నిజాం విచారణ ఎదుర్కొన్నారు. న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిగణించి నిందితులకు కఠిన శిక్షలను ఖరారు చేసింది.

ఈ హత్య కేసులో నిందితులపై 302, 120B, 109, 1989 ఎస్సీ/ఎస్టీ చట్టాలు, భారతీయ ఆయుధాల చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి. హత్యకు పాల్పడిన వ్యక్తులు శిక్షను తగ్గించుకోవాలని న్యాయమూర్తిని కోరినా, కోర్టు వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కఠినమైన తీర్పు ఇచ్చింది. హృదయ సంబంధిత సమస్యలు, కుటుంబ పరిస్థితుల కారణంగా శిక్షలో సడలింపు ఇవ్వాలన్న నిందితుల వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

ప్రణయ్ హత్యకు కారణమైన కులపరమైన వివక్ష, కుటుంబ నిర్బంధ వ్యవస్థపై ఈ తీర్పు పలు చర్చలకు దారి తీసింది. సామాజిక న్యాయం, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేలా కోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు. హత్యకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయగలమనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

This post was last modified on March 10, 2025 1:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

6 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

6 hours ago