Political News

పురందేశ్వ‌రి సైలెంట్‌గా ప‌ని మొద‌లెట్టేశారా..!

కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ త‌న‌ ప‌ని ప్రారంభిస్తోందా? సైలెంట్‌గా త‌న ఓటు బ్యాంకును పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాష్ట్రంలోని క‌మ‌ల నాథులు. “కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్ప‌టికీ.. మ‌నం మ‌న పంథాను మ‌రిచిపోకూడ‌దు. పార్టీని బ‌లంగా క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లాలి. దీనికి స‌న్నంద్ధం కండి. ప్ర‌జ‌లను క‌ల‌వండి వారి స‌మ‌స్య‌లు తెలుసుకోండి” అని తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు.

అంటే.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇప్ప‌టికే కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఇస్తున్న సొమ్ముల‌తోనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేస్తోందని పెద్ద ఎత్తున బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రి స‌త్య‌కుమార్ వ‌ర‌కు.. ఇదే విష‌యాన్ని ఏ వేదిక ఎక్కినా చెబుతున్నారు. విశాఖ‌ప‌ట్నం ఉక్కు ఫ్యాక్ట‌రీకి రూ.11 వేల కోట్లు ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

అంతేకాదు.. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి ప్ర‌పంచ బ్యాంకు నుంచి ఇప్పించిన అప్పులు, పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఇస్తున్న సొమ్ములు, బ‌డ్జ‌ట్‌లో ప్ర‌తిపాదించిన అంశాల‌ను కూడా బీజేపీ నాయ‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సొంత‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. అయితే.. ఇది సాధ్య‌మవుతుందా? కాదా? అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే.. మొత్తానికి ప్ర‌య‌త్నం అయితే చేప‌డుతున్నారు. దీనివ‌ల్ల ఓటు బ్యాంకు పెరిగి.. తాము సొంతగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం.

ఎవ‌రికి న‌ష్టం?
రాష్ట్రంలో బీజేపీకి సొంత‌గా ఉన్న ఓటు బ్యాంకు 1 శాతంలోపే ఉంటుంది. కొన్నాళ్ల కింద‌ట చేప‌ట్టిన‌.. పార్టీ స‌భ్య‌త్వ‌ నమోదు కూడా పెద్ద‌గా పార్టీకి ఫ‌లించ‌లేదు. అనుకున్న రేంజ్‌లో స‌భ్య‌త్వాన్ని న‌మోదు చేయ‌లేక పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు మోడీ ఇమేజ్‌తోపాటు.. కేంద్రం ఇస్తున్న సాయాన్ని ప్ర‌స్తావిస్తూ.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో వైసీపీ ఓటు బ్యాంకుకు ప్ర‌ధాన స‌మ‌స్య ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

టీడీపీ ఓటు బ్యాంకు జోలికి వెళ్లినా.. జ‌న‌సేన ఓటు బ్యాంకు జోలికి వెళ్లినా.. ఆయా పార్టీల నాయ‌కులు బ‌లంగా ఉన్నారు కాబ‌ట్టి.. అది సాధ్యంకాదు. ఇక‌, మిగిలింది.. వైసీపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకే. సో.. ఈ రెండు పార్టీల‌కే గండి కొట్టే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

4 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago