Political News

రాములమ్మకు ఎమ్మెల్సీ.. అగ్ర నేతల మాట నెగ్గలేదు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ స్వరాన్ని గట్టిగా వినిపిస్తూ వస్తున్న అద్దంకి దయాకర్ కు ఓ సీటును కేటాయించిన హస్తం పార్టీ… ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ కు టికెట్ ఇచ్చేసింది. ఇక జనరల్ కేటగిరీలో ఏ ఒక్కరూ ఊహించనట్లుగా మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆశావహుల జాబితాలో అస్సలు కనిపించని రాములమ్మ…ఏకంగా టికెట్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి ఎన్నిక లాంఛనమేనని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే…ఈ జాబితాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కాంగ్రెస్ లోనే కాకుండా టీడీపీలో ఉన్న సమయంలోనూ రేవంత్, నరేందర్..మంచి స్నేహితులుగా కొనసాగారు. వాస్తవానికి రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తర్వాతే వేం నరేందర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఆయన కొనసాగుతున్నారు. అయితే నరేందర్ కు మరింత ప్రాధాన్యం ఇద్దామన్న దిశగా రేవంత్ యోచించారు. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం రేవంత్ ప్రతిపాదనలకు ఓకే చెప్పలేదు. మరోవైపు పార్టీ సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి..సంగారెడ్డికి చెందిన మరో సీనియర్ నేత కుసుమ కుమార్ కు ఎమ్మెల్సీ ఇప్పించేందుకు యత్నించారు. ఈ ప్రతిపాదనను కూడా అధిష్ఠానం పక్కకు పెట్టింది.

అద్దంకి దయాకర్, విజయశాంతిలు జనానికి బాగా తెలిసిన నేతలుగానే చెప్పాలి. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన శంకర్ నాయక్ ను మాత్రం అంతగా ప్రాచుర్యం దక్కని నేతగానే చెప్పాలి. నల్లగొండ జిల్లా జనానికి తప్పించి మిగిలిన ప్రజలకు అంతగా పరిచయం లేని శంకర్… పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ అధిష్ఠానం వద్ద మంచి గుర్తింపు సంపాదించినట్లు సమాచారం. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన, చేస్తున్న నేతలకు తప్పనిసరిగా మంచి గుర్తింపు దక్కాల్సిందేనన్న భావనతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ కు ఈ భావనే టికెట్ దక్కేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 9, 2025 8:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

47 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

59 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago