శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(శ్రీశైలం కుడి కాల్వ) టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకు పోయిన.. ఆరుగురు కూలీలు, ఇద్దరు ఇంజనీర్లు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. ఆనాడు జరిగిన ఘోర ప్రమాదంలో వారంతా లోపలే చిక్కుకుపోయారు. అయితే.. వీరిని కాపాడేందుకు జాతీయ, అంతర్జా తీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే.. ఎవరి జాడా కనిపించలేదు. తాజాగా మనిషి శరీరానికి సంబంధించిన ఆనవాళ్లు కాంక్రీట్లో కనిపించినట్టు అధికారులు తెలిపారు.
దీంతో ఆ ఎనిమిది మంది పరిస్తితి ఇలానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ భౌతిక దేహాలు కనిపించినా.. ప్రాణాలతో ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తాజాగా టీబీఎంకు ఎడమ పక్కన ఒక చేయిని స్నిఫర్ డాగ్స్ గుర్తించాయి. దీనిని అధికారులు వెలికి తీయించారు. అయితే.. మరింతలోతుగా పనిచేస్తేనే ఇతరుల ఆనవాళ్లు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం కనిపించిన ఆనవాళ్లు ఆధారంగా కాంక్రీట్ మిశ్రమంలో కార్మికులు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
దీంతో కాంక్రీట్ను తొలగించేందుకు, కార్మికులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి ఘటన జరిగి 16 రోజులు అయిందని చెబుతున్నారు. దీంతో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అంటున్నారు. టన్నెల్లో అణువణువునూ గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. సహాయక చర్యలకు.. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఊట నీరు పైకి ప్రవహిస్తుండడంతో పనులు చేపట్టడం దుశ్శాధ్యంగా మారుతోందని అంటున్నారు.
ఏదేమైనా.. 8 మంది ఆచూకీ విషయం అనుమాస్పదమేనని చెబుతున్నారు. ఇదిలావుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు.. సఫలం అయినా.. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అన్నట్టుగా పరిస్థితి మారే సరికి సర్కారు కూడా.. ఆవేదనలో మునిగిపోయింది. అయితే, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
This post was last modified on March 9, 2025 7:02 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…