Political News

వారంతా లేన‌ట్టే..

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌(శ్రీశైలం కుడి కాల్వ‌) టన్నెల్‌లో గ‌త నెల 22న జ‌రిగిన ప్ర‌మాదంలో చిక్కుకు పోయిన‌.. ఆరుగురు కూలీలు, ఇద్ద‌రు ఇంజ‌నీర్లు లేన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నారు. ఆనాడు జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో వారంతా లోప‌లే చిక్కుకుపోయారు. అయితే.. వీరిని కాపాడేందుకు జాతీయ‌, అంత‌ర్జా తీయ స్థాయి సంస్థ‌ల స‌హ‌కారం తీసుకుని ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే.. ఎవ‌రి జాడా క‌నిపించ‌లేదు. తాజాగా మ‌నిషి శ‌రీరానికి సంబంధించిన ఆనవాళ్లు కాంక్రీట్‌లో క‌నిపించిన‌ట్టు అధికారులు తెలిపారు.

దీంతో ఆ ఎనిమిది మంది ప‌రిస్తితి ఇలానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ భౌతిక దేహాలు క‌నిపించినా.. ప్రాణాల‌తో ఉండే అవ‌కాశం లేద‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. తాజాగా టీబీఎంకు ఎడమ ప‌క్క‌న ఒక చేయిని స్నిఫ‌ర్ డాగ్స్ గుర్తించాయి. దీనిని అధికారులు వెలికి తీయించారు. అయితే.. మ‌రింత‌లోతుగా ప‌నిచేస్తేనే ఇత‌రుల ఆన‌వాళ్లు ల‌భిస్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం క‌నిపించిన ఆన‌వాళ్లు ఆధారంగా కాంక్రీట్ మిశ్ర‌మంలో కార్మికులు కూరుకుపోయి ఉంటార‌ని భావిస్తున్నారు.

దీంతో కాంక్రీట్‌ను తొల‌గించేందుకు, కార్మికుల‌ను గుర్తించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికి ఘ‌ట‌న జ‌రిగి 16 రోజులు అయింద‌ని చెబుతున్నారు. దీంతో ఎవ‌రూ ప్రాణాల‌తో ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ట‌న్నెల్‌లో అణువ‌ణువునూ గాలిస్తున్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు.. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు.. అడుగ‌డుగునా ఆటంకాలు ఎదుర‌వుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఊట నీరు పైకి ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ప‌నులు చేప‌ట్ట‌డం దుశ్శాధ్యంగా మారుతోంద‌ని అంటున్నారు.

ఏదేమైనా.. 8 మంది ఆచూకీ విష‌యం అనుమాస్ప‌ద‌మేన‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌లు.. స‌ఫ‌లం అయినా.. ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. పేషంట్ డెడ్ అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారే స‌రికి స‌ర్కారు కూడా.. ఆవేద‌న‌లో మునిగిపోయింది. అయితే, బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని సీఎం గతంలోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

This post was last modified on March 9, 2025 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

6 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

6 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

7 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

7 hours ago