రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మహిళల ఓటు బ్యాంకు 2026 నాటికి 20-30 శాతం మేరకు పెరుగుతుందన్న అంచ నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ.. మహిళలకు ఎనలేని ప్రాదాన్యం ఇస్తున్నాయి. దీనిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు మరింత ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుండడం మరో విశేషం.
మహిళా పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు సర్కారు వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. వీరికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం నుంచి పారిశ్రామికంగా.. పరిశ్రమల స్థాపన వరకు.. అన్ని రంగాల్లోనూ చేదోడుగా నిలుస్తోంది. డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేయడంలోనూ.. సర్కారు దూకుడుగా ఉంది. తద్వారా స్వయం సహాయక సంఘాలను డెవలప్ చేయడంలోనూ సర్కారు దీర్ఘకాల లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
ప్రభుత్వ పరంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ కూటమి ముందు చూపుతో వ్యవహరిస్తోంది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రొవైడ్ చేసిన ప్రభుత్వం.. దీనిని వచ్చే నాలుగు సంవత్సరాల పాటు కొనసాగించనుంది. ఇది మహిళలకు.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఎంతో మేలు చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సామాజిక భద్రతా పింఛన్లు తీసుకునేవారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వారికి కూడా పెంచిన పింఛను మరింత మేలు చేస్తోంది.
ఇక, త్వరలోనే.. తల్లికి వందనం పేరుతో అమలు చేయనున్న కీలక పథకం కూడా.. మహిళలకు వరంగా మారనుంది. ఈ పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే.. అన్ని రూ.15000 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. తద్వారా.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించనున్నాయి. ఇక, స్థానిక పదవుల్లోనూ.. నామినేటెడ్ పదవుల్లోనూ త్వరలోనే మహిళలకు 33 శాతం పదవులు ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయం కూడా అమలైతే.. ఇక, కూటమిసర్కారు వెంటే మహిళలు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
This post was last modified on March 9, 2025 4:20 pm
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…