మరో 12 రోజుల్లో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే.. మొత్తం 5 స్థానాలను కూటమి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. నలుగురు ఎమ్మెల్యేల అవసరం ఉంది. మొత్తం 175 మందిలో 168 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అయితే.. తప్ప.. గుండు గుత్తగా ఐదు స్థానాలు కూటమికి దక్కడం సాధ్యంకాదు. కానీ, ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో మరో నలుగురి కోసం కూటమి ప్రయత్నాలు చేస్తోంది.
వీరు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలే అయి ఉండడం గమనార్హం. మరో ప్రతిపక్షం లేకపోవడం.. మరో పార్టీకి రాష్ట్రంలో ప్రజలు ఓటేయకపోవడంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల వైపు..కూటమి నాయకులు సీరియస్ గా దృష్టి పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోగలిగితే.. ఇక, ఐదు స్థానాల్లోనూ విజయం ఖాయం. అయితే.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడుసస్పెన్స్గా మారింది. తాజాగా మారు తున్న పరిణామాలను బట్టి.. ఆ నలుగురి వేట ముమ్మరంగా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీ తొలిసారి విజయం దక్కించుకున్న నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని కూడా తెలిసిం ది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ మారకపోయినా.. తన నియోజకవర్గంలో చెప్పిన పనులు చేస్తే.. తాను కూటమికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమైనట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక, మరో ముగ్గురి విషయానికి వస్తే.. వీరు కూడా రెడీ అన్నట్టుగా సంకేతాలు వచ్చాయన్న చర్చ సాగుతోం ది. అయితే.. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని.. అంటున్నారు. పేర్లు బయట కు చెక్కకపోయినా.. గతంలో వీరిపై కేసులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఇక, వైసీపీలో ఉన్నా.. ఈ ఇద్దరు రెడ్డి నాయకులు సైలెంట్ గా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో మొత్తంగా.. ముగ్గురు కలిసి వచ్చారన్నది ఖాయం. అయితే.. ఇంకొక్క ఎమ్మెల్యే వ్యవహారం తెలియాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 9, 2025 2:38 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…