Political News

టీడీపీ ఎత్తులకు రాచమల్లు పై ఎత్తులు

కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. విపక్షం వైసీపీకి గట్టి పట్టున్న కడప, పులివెందులలోనే టీడీపీ వ్యూహాలు అమలు అవుతుంటే…టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రొద్దుటూరులో మాత్రం ఆ పార్టీ వ్యూహాలను అక్కడి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతి వ్యూహాలు రచిస్తూ అధికార పక్షానికే షాకులిస్తున్నారు.

టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికక్కడ నగర పంచాయతీలు మొదలుకుని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో పాలక వర్గాలు అంతా అధికారపక్షం వహిస్తున్నారు. అలాంటిది టీడీపీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లను రాచమల్లు తిరిగి తమ పార్టీలోకి వచ్చేలా వ్యూహాలు అమలు చేశారు. ఇటీవలే వైసీపిని వీడిన ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం రాచమల్లు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.

ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో మొత్తం 41 వార్డులు ఉన్నాయి. గత మునిసిపల్ ఎన్నికల్లో 40 స్థానాలను నాటి అధికార వైసీపీ దక్కించుకోగా… ఒక్క స్థానాన్ని మాత్రం టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత ఆ ఒక్క సభ్యుడు కూడా వైసీపీలో చేరిపోవడంతో ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో టీడీపీ బలం జీరోకు పడిపోయింది. అయితే ఇటీవలి ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటిదాకా ప్రొద్దుటూరులో వైసీపీ గాలి వీయగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీని టీడీపీ చిత్తు చేసింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ మోస్ట్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి… రాచమల్లుకు హ్యాట్రిక్ దక్కకుండా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వరుసబెట్టి 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఇంకో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరితే… చైర్మన్ పదవి టీడీపీకే దక్కేస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో రంగంలోకి దిగిన రాచమల్లు… టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కౌన్సిలర్లను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చే దిశగా వ్యూహాలు అమలు చేశారు. పార్టీని వీడిన కౌన్సిలర్లు తిరిగి వస్తే… సాదరంగా ఆహ్వానిస్తానని, వారిని మరింత మంచిగా చూసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో ఆయన రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ చర్చలు ఫలించినట్లుగా.. ఆదివారం 8, 39,40 వార్డుల కౌన్సిలర్లు శాంతి, అనిల్, అరుణ.. రాచమల్లు సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఫలితంగా 18కి చేరిన టీడీపీ బలం 15కు పడిపోయింది. 23గా ఉన్న వైసీపీ బలం 25కు చేరిపోయింది. ఫలితంగా ప్రస్తుతానికి ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న వైసీపీ నేత లక్ష్మిదేవికి పదవీ గండం అయితే తప్పిందనే చెప్పాలి.

This post was last modified on March 9, 2025 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

48 minutes ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

1 hour ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

2 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

2 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

5 hours ago