Political News

టీడీపీ ఎత్తులకు రాచమల్లు పై ఎత్తులు

కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. విపక్షం వైసీపీకి గట్టి పట్టున్న కడప, పులివెందులలోనే టీడీపీ వ్యూహాలు అమలు అవుతుంటే…టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రొద్దుటూరులో మాత్రం ఆ పార్టీ వ్యూహాలను అక్కడి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతి వ్యూహాలు రచిస్తూ అధికార పక్షానికే షాకులిస్తున్నారు.

టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికక్కడ నగర పంచాయతీలు మొదలుకుని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో పాలక వర్గాలు అంతా అధికారపక్షం వహిస్తున్నారు. అలాంటిది టీడీపీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లను రాచమల్లు తిరిగి తమ పార్టీలోకి వచ్చేలా వ్యూహాలు అమలు చేశారు. ఇటీవలే వైసీపిని వీడిన ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం రాచమల్లు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.

ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో మొత్తం 41 వార్డులు ఉన్నాయి. గత మునిసిపల్ ఎన్నికల్లో 40 స్థానాలను నాటి అధికార వైసీపీ దక్కించుకోగా… ఒక్క స్థానాన్ని మాత్రం టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత ఆ ఒక్క సభ్యుడు కూడా వైసీపీలో చేరిపోవడంతో ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో టీడీపీ బలం జీరోకు పడిపోయింది. అయితే ఇటీవలి ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటిదాకా ప్రొద్దుటూరులో వైసీపీ గాలి వీయగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీని టీడీపీ చిత్తు చేసింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ మోస్ట్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి… రాచమల్లుకు హ్యాట్రిక్ దక్కకుండా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వరుసబెట్టి 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఇంకో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరితే… చైర్మన్ పదవి టీడీపీకే దక్కేస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో రంగంలోకి దిగిన రాచమల్లు… టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కౌన్సిలర్లను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చే దిశగా వ్యూహాలు అమలు చేశారు. పార్టీని వీడిన కౌన్సిలర్లు తిరిగి వస్తే… సాదరంగా ఆహ్వానిస్తానని, వారిని మరింత మంచిగా చూసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో ఆయన రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ చర్చలు ఫలించినట్లుగా.. ఆదివారం 8, 39,40 వార్డుల కౌన్సిలర్లు శాంతి, అనిల్, అరుణ.. రాచమల్లు సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఫలితంగా 18కి చేరిన టీడీపీ బలం 15కు పడిపోయింది. 23గా ఉన్న వైసీపీ బలం 25కు చేరిపోయింది. ఫలితంగా ప్రస్తుతానికి ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న వైసీపీ నేత లక్ష్మిదేవికి పదవీ గండం అయితే తప్పిందనే చెప్పాలి.

This post was last modified on March 9, 2025 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

41 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago