Political News

టీడీపీ ఎత్తులకు రాచమల్లు పై ఎత్తులు

కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. విపక్షం వైసీపీకి గట్టి పట్టున్న కడప, పులివెందులలోనే టీడీపీ వ్యూహాలు అమలు అవుతుంటే…టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రొద్దుటూరులో మాత్రం ఆ పార్టీ వ్యూహాలను అక్కడి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతి వ్యూహాలు రచిస్తూ అధికార పక్షానికే షాకులిస్తున్నారు.

టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికక్కడ నగర పంచాయతీలు మొదలుకుని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో పాలక వర్గాలు అంతా అధికారపక్షం వహిస్తున్నారు. అలాంటిది టీడీపీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లను రాచమల్లు తిరిగి తమ పార్టీలోకి వచ్చేలా వ్యూహాలు అమలు చేశారు. ఇటీవలే వైసీపిని వీడిన ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం రాచమల్లు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.

ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో మొత్తం 41 వార్డులు ఉన్నాయి. గత మునిసిపల్ ఎన్నికల్లో 40 స్థానాలను నాటి అధికార వైసీపీ దక్కించుకోగా… ఒక్క స్థానాన్ని మాత్రం టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత ఆ ఒక్క సభ్యుడు కూడా వైసీపీలో చేరిపోవడంతో ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో టీడీపీ బలం జీరోకు పడిపోయింది. అయితే ఇటీవలి ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటిదాకా ప్రొద్దుటూరులో వైసీపీ గాలి వీయగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీని టీడీపీ చిత్తు చేసింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ మోస్ట్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి… రాచమల్లుకు హ్యాట్రిక్ దక్కకుండా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వరుసబెట్టి 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఇంకో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరితే… చైర్మన్ పదవి టీడీపీకే దక్కేస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో రంగంలోకి దిగిన రాచమల్లు… టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కౌన్సిలర్లను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చే దిశగా వ్యూహాలు అమలు చేశారు. పార్టీని వీడిన కౌన్సిలర్లు తిరిగి వస్తే… సాదరంగా ఆహ్వానిస్తానని, వారిని మరింత మంచిగా చూసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో ఆయన రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ చర్చలు ఫలించినట్లుగా.. ఆదివారం 8, 39,40 వార్డుల కౌన్సిలర్లు శాంతి, అనిల్, అరుణ.. రాచమల్లు సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఫలితంగా 18కి చేరిన టీడీపీ బలం 15కు పడిపోయింది. 23గా ఉన్న వైసీపీ బలం 25కు చేరిపోయింది. ఫలితంగా ప్రస్తుతానికి ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న వైసీపీ నేత లక్ష్మిదేవికి పదవీ గండం అయితే తప్పిందనే చెప్పాలి.

This post was last modified on March 9, 2025 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago