Political News

టీడీపీ ఎత్తులకు రాచమల్లు పై ఎత్తులు

కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. విపక్షం వైసీపీకి గట్టి పట్టున్న కడప, పులివెందులలోనే టీడీపీ వ్యూహాలు అమలు అవుతుంటే…టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రొద్దుటూరులో మాత్రం ఆ పార్టీ వ్యూహాలను అక్కడి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతి వ్యూహాలు రచిస్తూ అధికార పక్షానికే షాకులిస్తున్నారు.

టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికక్కడ నగర పంచాయతీలు మొదలుకుని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో పాలక వర్గాలు అంతా అధికారపక్షం వహిస్తున్నారు. అలాంటిది టీడీపీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లను రాచమల్లు తిరిగి తమ పార్టీలోకి వచ్చేలా వ్యూహాలు అమలు చేశారు. ఇటీవలే వైసీపిని వీడిన ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం రాచమల్లు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.

ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో మొత్తం 41 వార్డులు ఉన్నాయి. గత మునిసిపల్ ఎన్నికల్లో 40 స్థానాలను నాటి అధికార వైసీపీ దక్కించుకోగా… ఒక్క స్థానాన్ని మాత్రం టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత ఆ ఒక్క సభ్యుడు కూడా వైసీపీలో చేరిపోవడంతో ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో టీడీపీ బలం జీరోకు పడిపోయింది. అయితే ఇటీవలి ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటిదాకా ప్రొద్దుటూరులో వైసీపీ గాలి వీయగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీని టీడీపీ చిత్తు చేసింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ మోస్ట్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి… రాచమల్లుకు హ్యాట్రిక్ దక్కకుండా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వరుసబెట్టి 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఇంకో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరితే… చైర్మన్ పదవి టీడీపీకే దక్కేస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో రంగంలోకి దిగిన రాచమల్లు… టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కౌన్సిలర్లను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చే దిశగా వ్యూహాలు అమలు చేశారు. పార్టీని వీడిన కౌన్సిలర్లు తిరిగి వస్తే… సాదరంగా ఆహ్వానిస్తానని, వారిని మరింత మంచిగా చూసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో ఆయన రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ చర్చలు ఫలించినట్లుగా.. ఆదివారం 8, 39,40 వార్డుల కౌన్సిలర్లు శాంతి, అనిల్, అరుణ.. రాచమల్లు సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఫలితంగా 18కి చేరిన టీడీపీ బలం 15కు పడిపోయింది. 23గా ఉన్న వైసీపీ బలం 25కు చేరిపోయింది. ఫలితంగా ప్రస్తుతానికి ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న వైసీపీ నేత లక్ష్మిదేవికి పదవీ గండం అయితే తప్పిందనే చెప్పాలి.

Satya

Recent Posts

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

2 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

2 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

3 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

3 hours ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

3 hours ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

3 hours ago