Political News

ఏర్పాట్లే ఇలా ఉంటే… సభ ఊహకే అందట్లేదు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల సమక్షంలో ఈ నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటంతో ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం పిఠాపురం పరిధిలోని చిత్రాడలో ఆవిర్భావ వేడకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి పార్టీలోని దాదాపుగా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ సాగుతున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు సంబంధించిన పలు కమిటీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుబాటులోకి వస్తున్న మరింత మంది నేతలను ఆయా కమిటీల్లోకి జత చేస్తూ సాగుతున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అయితే ఈ ఏర్పట్లలో నిండా మునిగిపోయారు. సభ ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్న ప్రతి చిన్న పనిని కూడా ఆయన దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కింది స్థాయి కార్యకర్తలు అంతా ఈ ఏర్పాట్లలోనూ మునిగిపోయారు. ఫలితంగా పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది.

తాజాగా శనివారం జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన  ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షించేందుకు ఏకంగా కంట్రోల్ రూం అందుబాటులోకి వచ్చింది. పిఠాపురంలో ఈ కంట్రోల్ రూంను నాదెండ్లతో కలిసి ఉదయ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఏర్పాట్ల తీరు చూస్తుంటే.. నిజంగానే జనసేన ఆవిర్భావ వేడకలు ఏ రేంజిలో జరుగుతాయన్న అంశం అసలు ఊహకే అందట్లేదు. ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం, పవన్ చట్టసభల్లోకి అడుగుపెట్టడతోనే డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తీరుతో పార్టీ శ్రేణులు ఉరిమే ఉత్సాహంతో ఉన్నారు. ఫలితంగా ఈ సభకు 10 లక్షలకు మించిన జనం హాజరైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదన వినిపిస్తోంది.

1 / 11

This post was last modified on March 8, 2025 8:35 pm

Share

Recent Posts

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 minute ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

12 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

2 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

9 hours ago