తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన అధికారిక నివాసం ప్రజా భవన్ లో శనివారం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులో ఈ భేటీని నిర్వహించాలని భట్టి తలచారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశానికి అధికార కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా అఖిల పక్ష సమావేశం కాస్తా… రెండు పార్టీల భేటీగా మారిపోయింది. ఈ బేటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఎంపీలందరూ హాజరు కాగా… మజ్లిస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూ కీలక చర్చ జరుపుదాం రమ్మంటూ… డిప్యూటీ సీఎం హోదాలో భట్టి రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఇదివరకే లేఖలు రాశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బాగంగా మలి విడత సమావేశాలకు సమయం ఆసన్నమైన వేళ ఈ సమావేశం కీలకమైనదని… అన్ని పార్టీలు తమ పార్లమెంటు సభ్యులను ఈ సమావేశానికి పంపి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని భట్టి తన లేఖలో కోరారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కావడం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అన్నిపార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
అయితే భట్టి వినతిని బీఆర్ఎస్ సహా బీజేపీలు తిరస్కరించాయి. ఈ మేరకు భట్టికి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డిలు ప్రత్యుత్తరాలు రాశారు. ఈ లేఖల్లో ఆ రెండు పార్టీలు కూడా ఒకే కారణాన్ని ప్రస్తావించారు. అధికార పక్షం నిర్వహిస్తున్న ఈ భేటీకి హాజరు కావాలని తమకూ ఉందని పేర్కొన్న ఇరు పార్టీలు… సమయాభావం వల్లే ఈ భేటీకి హాజరు కాలేకపోతున్నామని తెలిపాయి. ఇలాంటి కీలక భేటీ గురించి చాలా ముందుగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదన్న బీజేపీ, బీఆర్ఎస్ లు… అప్పటికప్పుడు రమ్మంటే ఎలా కుదురుతుందని తెలిపాయి. ఆలస్యంగా ఆహ్వానం పంపడం… అప్పటికే పలు ముఖ్యమైన కార్యక్రమాలకు తాము షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని… ఫలితంగానే ఈ భేటీకి రాలేకపోతున్నామని తెలిపాయి. అయితే ఆల్ పార్టీ మీట్ కు పిలిచినందుకు ఇరు పార్టీలు భట్టికి ధన్యవాదాలు తెలిపాయి.
This post was last modified on March 8, 2025 1:03 pm
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…