Political News

రెండుసార్లు ఓటు వేసే వారికి చెక్.. EC కీలక నిర్ణయం!

భారత ఎన్నికల సంఘం (EC) ఓటర్ ఐడీ కార్డుల డూప్లికేట్ నంబర్ల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 99 కోట్లకు పైగా ఓటర్లు ఉండటంతో, భారత ఎన్నికల జాబితా ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్‌గా ఉంది. అయితే, చాలా సంవత్సరాలుగా ఓటర్ కార్డుల డూప్లికేట్ నంబర్ల సమస్య కొనసాగుతోంది. ఉదాహరణకు గ్రామాల నుంచి వచ్చి సిటీలో ఉన్న వారు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడమే కాకుండా రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అనేలా ఆరోపణలు వచ్చాయి.

కొందరి ఓటర్ కార్డుల సంఖ్యలు రెండుసార్లు నమోదు కావడం వల్ల ఎన్నికల సమయంలో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను పూర్తిగా తొలగించేందుకు ఎన్నికల సంఘం మూడు నెలల్లో యూనిక్ ఓటర్ ఐడీ నంబర్ వ్యవస్థను తీసుకురాబోతోంది. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎన్నికల సంఘంపై కవరప్ చేస్తున్నట్లు ఆరోపించింది. అయితే, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

ఈ సమస్య చాలా కాలం నుంచి కొనసాగుతోంది, ఇక దాని పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. డూప్లికేట్ ఓటర్ కార్డులున్నా, ఓటింగ్ హక్కు మాత్రం ఓటర్ పేరు నమోదు అయిన పోలింగ్ బూత్‌లో మాత్రమే ఉంటుందని EC స్పష్టం చేసింది. కానీ, ఓటర్ ఐడీ నంబర్ల సమస్య ఓటింగ్ సమయంలో కొన్ని చోట్ల గందరగోళానికి కారణమవుతోంది. దీనికి పరిష్కారంగా, ప్రతి ఓటరుకు యూనిక్ నేషనల్ EPIC నంబర్ (Electoral Photo Identity Card Number) కేటాయించాలని నిర్ణయించారు.

ఈ కొత్త విధానం ద్వారా ప్రస్తుతం ఉన్న డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు నంబర్లను తొలగించి, వారికి కొత్త యూనిక్ నంబర్లు ఇవ్వనున్నారు. దీనితో పాటు భవిష్యత్తులో కొత్త ఓటర్లకు కూడా ప్రత్యేకంగా ఒకే ఒక నంబర్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులతో కలిసి, టెక్నికల్ టీమ్ దీనిపై ప్రత్యేకంగా పని చేస్తోంది. దీని ద్వారా ఓటర్ల లిస్టులో స్పష్టత వస్తుందని, డూప్లికేట్ ఓటింగ్‌కు తావు ఉండదని EC చెబుతోంది.

This post was last modified on March 8, 2025 5:27 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

26 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago