నిజమే.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగేదే లేదని తేల్చి చెప్పేశారు. అందుకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సరేనన్నారు. అంతే… పిఠాపురంలో ఈ నెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లో జరగాల్సిన కార్యక్రమం శుక్రవారం సాయంత్రమే ముగిసిపోయింది. ఇదివరకే జనసేనలోకి పెండెం దొరబాబు చేరిక ఖరారు కాగా… శుక్రవారం ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు.
మంగళగిరి పరిధిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పెండెం దొరబాబును పార్టీ అధినేత హోదాలో పవన్ కల్యాణ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ పార్టీ కండువాను దొరబాబుకు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో దొరబాబు అనుచరులు పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ గురించి దొరబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తన జీవిత కాలం పాటు పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగాలని తాను ఆశిస్తున్నానని దొరబాబు అన్నారు. పవన్ కృషి… నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధలను చూసిన తర్వాత… పవన్ కు తనవంతు మద్దతు ఇవ్వాలన్న లక్ష్యంతోనే పార్టీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు. పవన్ నేతృత్వంలో పిఠాపురం అభివృద్ధి రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలుస్తుందని కూడా ఆయన చెప్పారు.
This post was last modified on March 7, 2025 9:33 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…