Political News

పేర్ని నానిపై హైకోర్టు ఆగ్ర‌హం.. కానీ..!

వైసీపీ మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు పేర్ని వెంక‌ట్రామ‌య్య ఉర‌ఫ్ పేర్ని నాని వ్య‌వ‌హారంపై ఏపీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పేద‌ల‌కు ఇచ్చే బియ్యాన్ని దారి మ‌ళ్లించారంటూ.. పేర్ని కుటుంబంపై ఏపీ ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. పేర్ని ఫ్యామిలి వైసీపీ హ‌యాంలో సొంత‌గా గోడౌన్లు నిర్మించింది. దీనిలో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌కు చెందిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక‌.. నిల్వ‌ల‌ను లెక్కించింది.

ఈ క్ర‌మంలోనే దాదాపు వేల కోట్ల రూపాయ‌ల రేష‌న్ బియ్యం పేర్ని స‌తీమ‌ణి పేరిట ఉన్న గోడౌన్ల‌లో మిస్స య్యాయి. అప్ప‌ట్లోనే స‌ర్కారుకు కోట్ల రూపాయ‌ల పెనాలిటీ రూపంలో చెల్లించారు. అయితే.. పెనాలిటీ క‌ట్టినా కేసులు కొన‌సాగుతాయ‌ని.. పేద‌ల బియ్యాన్ని దారి మ‌ళ్లించి వేల కోట్లు సొమ్ము చేసుకున్నార‌ని స‌ర్కారు అప్ప‌ట్లో తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలోనే పేర్ని నానిపైనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల్లో పేర్ని ఏ-6గా ఉన్నారు. దీంతో త‌న‌ను పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న భావించారు.

ఈ క్ర‌మంలోనే చాలా రోజుల పాటు మీడియా ముందుకు రాకుండా త‌ప్పించుకుని తిరిగారు. గ‌త నెల ప్రారంభంలో ఈ వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశం అయింది. తాజాగా పేర్ని నాని.. హైకోర్టును ఆశ్ర‌యించి త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని పోలీసులు అరెస్టు చేయ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై ప‌లుమార్లు విచారించిన హైకోర్టు.. తాజాగా పేర్ని నానికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చింది. అయితే.. పేద‌ల బియ్యాన్ని దారి మ‌ళ్లించ‌డం తీవ్ర‌మైన అంశ‌మని పేర్కొంది.

“పేద‌ల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే బియ్యాన్ని మీరు దారిమ‌ళ్లించ‌డం నిజ‌మైతే.. దీనికి సంబంధించిన ఆధారాలు నిరూపిస్తే.. తీవ్రంగా ప‌రిణ‌గ‌మించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి అందిస్తున్న ఆహారాన్ని పేద‌ల‌కు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంటుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక‌పై.. ఇలాంటి త‌ప్పులు చేసేవారిని వ‌దిలి పెట్టుకుండా.. క‌ఠిన చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేయాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది.

This post was last modified on March 7, 2025 5:52 pm

Share
Show comments
Published by
Satya
Tags: Perni Nani

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

2 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

3 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

6 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

6 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

7 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

7 hours ago