వైసీపీ మాజీ నాయకుడు, మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలపై అందిన ఫిర్యాదు మేరకు.. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం ఓబులవారి పల్లె పోలీసులు.. కొన్ని రోజుల కిందట పోసానిని హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను కడపకు తరలించి.. జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
అనంతరం.. తమ జిల్లాలోనూ పోసానిపై ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొంటూ.. పల్నాడు, కర్నూలు జిల్లాల పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకుని.. రిట్ పిటిషన్ వేసి.. విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. తనపై కేసులు కొట్టివేయాలని కోరుతూ.. పోసాని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అనేక మార్లు విచారణ జరిపిన కోర్టు.. తాజాగా శుక్రవారం పోసానిపై కేసులు కొట్టివేసేందుకు నిరాకరించింది. ఇది భారీ ఎదురు దెబ్బకాగా.. ఇదేసమయంలో కడప కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది.
అయితే.. ఈ బెయిల్ కేవలం.. ఓబులవారిపల్లెలో నమోదైన కేసుకు సంబంధించి మాత్రమే వర్తిస్తుందని.. కోర్టు స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు.. పోలీసులు పోసానిని తమకు అప్పగించాలంటూ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చామని.. పేర్కొన్న న్యాయస్థానం తాజాగా దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో ఈ కేసులో పోసానికి ఊరట లభించింది.
కానీ, కర్నూలు జిల్లా ఆదోని, పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులు మాత్రం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లోనూ పోసానికి 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో ఆయనకు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఈ కేసుల్లో ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. కాగా.. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, నారా చంద్రబాబు సహా వారి కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారని పేర్కొంటూ.. పోసాని రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదైన విషయం తెలిసిందే.
This post was last modified on March 7, 2025 5:36 pm
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…