వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మరోమారు బెంగళూరు బయలుదేరారు. 3 రోజుల క్రితం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్… రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉన్నారు. మూడో రోజు మధ్యాహ్నమే ఆయన సతీసమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టులో బెంగళూరు విమానం ఎక్కేశారు. ఈ టూర్ లో జగన్ తాడేపల్లిలో ఉన్నది కేవలం రెండు రోజులేనన్న మాట.
తాడేపల్లిలో ఉన్న రెండు రోజుల్లో జగన్ ఓ రోజు ఏపీ వార్షిక బడ్జెట్ పై సుదీర్ఘ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన ఈ మీడియా సమావేశంలో జగన్ ఏకంగా 2 గంటల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడారు. బడ్జెట్ లో ఆయా రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపుల కంటే కూడా రాజకీయ వ్యాఖ్యలకే జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లుగా మాట్లాడారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఘాటుగానే బదులు వచ్చేసింది.
ఇక ప్రెస్ మీట్ చివరలో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు అయితే సోషల్ మీడియాలో రచ్చకు తెర తీశాయి. ఇక తాడేపల్లిలో ఉన్న తన రెండో రోజులో జగన్… వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. లోక్ సభ సభ్యులతో పాటుగా రాజ్యసభ సభ్యులు కూడా హాజరైన ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ రెండు కార్యక్రమాలకే పరిమితమైన జగన్… మూడో రోజు ఫార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదనే చెప్పాలి. అంతేకాకుండా శుక్రవారం మధ్యాహ్నమే ఆయన బెంగళూరు ఫ్లైట్ ఎక్కడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on March 7, 2025 6:13 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…