వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మరోమారు బెంగళూరు బయలుదేరారు. 3 రోజుల క్రితం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్… రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉన్నారు. మూడో రోజు మధ్యాహ్నమే ఆయన సతీసమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టులో బెంగళూరు విమానం ఎక్కేశారు. ఈ టూర్ లో జగన్ తాడేపల్లిలో ఉన్నది కేవలం రెండు రోజులేనన్న మాట.
తాడేపల్లిలో ఉన్న రెండు రోజుల్లో జగన్ ఓ రోజు ఏపీ వార్షిక బడ్జెట్ పై సుదీర్ఘ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన ఈ మీడియా సమావేశంలో జగన్ ఏకంగా 2 గంటల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడారు. బడ్జెట్ లో ఆయా రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపుల కంటే కూడా రాజకీయ వ్యాఖ్యలకే జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లుగా మాట్లాడారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఘాటుగానే బదులు వచ్చేసింది.
ఇక ప్రెస్ మీట్ చివరలో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు అయితే సోషల్ మీడియాలో రచ్చకు తెర తీశాయి. ఇక తాడేపల్లిలో ఉన్న తన రెండో రోజులో జగన్… వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. లోక్ సభ సభ్యులతో పాటుగా రాజ్యసభ సభ్యులు కూడా హాజరైన ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ రెండు కార్యక్రమాలకే పరిమితమైన జగన్… మూడో రోజు ఫార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదనే చెప్పాలి. అంతేకాకుండా శుక్రవారం మధ్యాహ్నమే ఆయన బెంగళూరు ఫ్లైట్ ఎక్కడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on March 7, 2025 6:13 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…