Political News

విజయమ్మ, షర్మిలలపై జగన్ సంచలన ఆరోపణ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట వెలుగుచూసిన ఆస్తుల పంచాయతీ అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తోంది. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస షర్మిలలు ఒకవైపు నిలవగా… తన సతీమణి వైఎస్ భారతితో కలిసి జగన్ మరో వర్గంగా నిలిచారు. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో ఇరు వర్గాలు ఆది నుంచి బిన్న వాదనలను వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కోర్టులో విచారణలో ఉంది.

ఎప్పటికప్పుడు ఈ కేసులో అటు విజయమ్మ తరఫున, ఇటు జగన్ తరఫున పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి. ఒకరు ఓ పిటిషన్ దాఖలు చేస్తే… దానిపై వివరణ ఇస్తూ మరో వర్గం కౌంటర్ దాఖలు చేస్తోంది. ఆ కౌంటర్ కు ప్రతి కౌంటర్ కూడా దాఖలు అవుతోంది. ఇటీవల విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో అసలు సదరు కంపెనీలో జగన్ కు గానీ… భారతికి గానీ చిల్లిగవ్వ కూడా వాటా లేదని ఆమె కోర్టుకు తెలిపారు. కంపెనీకి చెందిన మొత్తం 99 శాతం షేర్లు తన పేరు మీదే ఉన్నాయని కూడా విజయమ్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తాజాగా జగన్ తన కౌంటర్ ను దాఖలు చేశారు. ఈ కౌంటర్ లో విజయమ్మ, షర్మిలలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన పేరు, తన సతీమణి భారతి పేర్లపై ఉన్న షేర్లను తమకు తెలియకుండానే విజయమ్మ, షర్మిలలు వారి పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కనీసం తన సంతకాన్నీ వారు తీసుకోకుండానే షేర్లను వారి పేర్లపైకి బదలాయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఇలా జరిగిన షేర్ల బదలాయింపును నిలుపుదల చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు విజయమ్మ, షర్మిలలతో సాడు సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆప్ కంపెనీస్ లను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. జగన్ వాదనపై కౌంటర్లు దాఖలు చేసేందుకు విజయమ్మ తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3కు కోర్టు వాయిదా వేసింది.

This post was last modified on March 7, 2025 6:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

2 hours ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

4 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

6 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

6 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

7 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

7 hours ago