Political News

విజయమ్మ, షర్మిలలపై జగన్ సంచలన ఆరోపణ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట వెలుగుచూసిన ఆస్తుల పంచాయతీ అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తోంది. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస షర్మిలలు ఒకవైపు నిలవగా… తన సతీమణి వైఎస్ భారతితో కలిసి జగన్ మరో వర్గంగా నిలిచారు. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో ఇరు వర్గాలు ఆది నుంచి బిన్న వాదనలను వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కోర్టులో విచారణలో ఉంది.

ఎప్పటికప్పుడు ఈ కేసులో అటు విజయమ్మ తరఫున, ఇటు జగన్ తరఫున పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి. ఒకరు ఓ పిటిషన్ దాఖలు చేస్తే… దానిపై వివరణ ఇస్తూ మరో వర్గం కౌంటర్ దాఖలు చేస్తోంది. ఆ కౌంటర్ కు ప్రతి కౌంటర్ కూడా దాఖలు అవుతోంది. ఇటీవల విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో అసలు సదరు కంపెనీలో జగన్ కు గానీ… భారతికి గానీ చిల్లిగవ్వ కూడా వాటా లేదని ఆమె కోర్టుకు తెలిపారు. కంపెనీకి చెందిన మొత్తం 99 శాతం షేర్లు తన పేరు మీదే ఉన్నాయని కూడా విజయమ్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తాజాగా జగన్ తన కౌంటర్ ను దాఖలు చేశారు. ఈ కౌంటర్ లో విజయమ్మ, షర్మిలలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన పేరు, తన సతీమణి భారతి పేర్లపై ఉన్న షేర్లను తమకు తెలియకుండానే విజయమ్మ, షర్మిలలు వారి పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కనీసం తన సంతకాన్నీ వారు తీసుకోకుండానే షేర్లను వారి పేర్లపైకి బదలాయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఇలా జరిగిన షేర్ల బదలాయింపును నిలుపుదల చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు విజయమ్మ, షర్మిలలతో సాడు సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆప్ కంపెనీస్ లను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. జగన్ వాదనపై కౌంటర్లు దాఖలు చేసేందుకు విజయమ్మ తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3కు కోర్టు వాయిదా వేసింది.

This post was last modified on March 7, 2025 6:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

32 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago