కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్రలో స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై చేసిన వ్యాఖ్యల కారణంగా 2022లో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి, ఆయన బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ వ్యక్తిగత కారణాలు చూపుతూ హాజరు కాలేదు. దీనిపై కోర్టు స్పందిస్తూ రూ.200 జరిమానా విధించింది. ఈ మొత్తం విచారణలో వాదన వినిపించిన ఫిర్యాదుదారుడి న్యాయవాదికి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
సావర్కర్పై 2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భాజపా, శివసేన (ఏకనాథ్ శిండే వర్గం) నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా సావర్కర్ను అవమానించేలా ఉన్నాయంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా సావర్కర్ పేరును అపకీర్తి పాల్జేయాలని కుట్ర పన్నారనే ఆరోపణలు వచ్చాయి.
డిసెంబర్ 2024లో అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ వర్మ రాహుల్ గాంధీని మార్చి 6న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, రాహుల్ గాంధీకి అనేక రాజకీయ కార్యక్రమాలు, విదేశీ ప్రతినిధులతో భేటీలు, ఇతర అధికారిక భాద్యతలు ఉండటంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు మినహాయింపు ఇచ్చినా, జరిమానా విధించడం చర్చనీయాంశమైంది.
ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. ఈ కేసు మాత్రమే కాదు, గతంలోనూ రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. గుజరాత్లోని సూరత్ కోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన 2023లో తన పార్లమెంటరీ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు.
This post was last modified on March 6, 2025 11:43 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…