వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు.. వి. విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె పట్ల జాలి చూపించాలంటూ.. నేహా రెడ్డి తరఫున న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. అసలు జాలి చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘ప్రకృతి సంపదను దోచేస్తున్న వారంతా.. ఇలానే కోరుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి జాలి చూపాల్సిన అవసరం లేదు. ఆమె కోటీశ్వరురాలని.. మాకు తెలిసింది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానిం చారు.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆ పార్టీ తరపున సాయిరెడ్డి ఇంచార్జ్గా వ్యవహరించారు. దీంతో ఆయన వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి కీలకమైన భీమిలి బీచ్ను ఆక్రమించి.. రిసార్టును నిర్మించే ప్రయత్నం చేశారు. దీనిపై జనసేన కార్పొరేటర్.. పీతల మూర్తి యాదవ్.. తొలుత మీడియా ముందు చెప్పారు. ఆ తర్వాత.. న్యాయ పోరాటానికి దిగారు. వైసీపీ హయాంలోనే ఈ పిటిషన్పై విచారణ జరిగింది.
అప్పట్లోనే నిర్మాణంలో ఉన్న రిసార్టును తొలగించాలని.. హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు సదరు అక్రమ నిర్మాణాలను తొలగించారు. అయితే.. ప్రహరీ కోసం బీచ్లో ఆరు అడుగుల మేర పునా దులు తవ్వారు. వీటిని అలానే వదిలేశారు. ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావించిన హైకోర్టు.. ఈ పునాదుల కారణంగా.. పర్యావరణానికి హాని కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
బీచ్లో గోడ తొలగించి ఆరు అడుగుల పునాదిని అలాగే వదిలేశారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింది. గోడ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయండి. గోడ కూల్చివేత ఖర్చు, పర్యావరణ నష్టం నేహా రెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయండి అని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ సమయంలోనే ఆమె తరఫున న్యాయవాది.. జాలి చూపాలని అన్నారు. అయితే.. జాలి చూపాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
This post was last modified on March 5, 2025 3:45 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…