‘మా అమ్మ గురించి అలా ఊహాజనిత వార్తలు రాయొద్దు. ప్రచారం చేయొద్దు’ అని ప్రముఖ గాయని కల్పన కుమార్తె.. మీడియాకు విన్నవించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పనను అంటిపెట్టుకునే ఉన్నట్టు ఆమె తెలిపారు. అమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉంది. దీనిపై అపోహలు ప్రబలేలా మీడియా వ్యవహరించడం సరికాదు. అని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తన తల్లి ఆత్మహత్యా యత్నం చేయలేదని ఆమె స్పష్టం చేసింది.
మా అమ్మ ఆత్మహత్య చేసుకునేందుకు పిరికి మనస్తత్వంతో లేదు. ఆమె చాలా ద్రుఢంగా ఉన్నారు. ప్రశాంతత కోసం.. వేసుకునే నిద్రమాత్రల డోస్ కొంచెం ఎక్కువైంది. దీనిపై లేని పోని ప్రచారం చేయడం దారుణం. మా నాన్న-అమ్మ సంతోషంగానే ఉన్నారు. వారి మధ్య ఎలాంటి కలతలు లేవు. కానీ, మీడియాలో ప్రచారం అవుతున్నది వాస్తవం కాదు. ఇలాంటివాటిని ఆపేయండి అని కల్పన కుమార్తె మీడియాకు విజ్ఞప్తి చేశారు.
కాగా.. కల్పన దక్షిణాదిలోనే కాకుండా.. ఖవ్వాలీ వంటి ఉత్తరాది సంగీతంలోనూ పేరు తెచ్చుకున్నారు. పంజాబీలోనూ ఆమె చేసే సంకీర్తనలకు ఆయా రాష్ట్రాల్లో మంచిపేరుంది. తాజాగా ఆమె నిద్రమాత్రలు వేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ విషయంపై భిన్నమైన వాదనలు, కథనాలు వెలుగు చూశాయి. కుమార్తెతో ఉన్న విబేదాల కారణంగానే కల్పన ఆత్మహత్యా యత్నం చేశారన్నదిఒకటైతే.. ఆర్థిక సమస్యలు, భర్తతో ఉన్న విభేదాలే కారణమని మరో ప్రచారం ఉంది. వీటిని తాజాగా ఆమె కుమార్తె ఖండించింది.
మరోవైపు.. కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కళ్లు తెరిచి చూడగలిగే స్థాయికి చేరుకుంటున్నట్టు బులిటిన్లో వివరించారు. ఆమె కోలుకుంటున్నారని.. ఆసుపత్రికి వచ్చిన ప్పటికి ఇప్పటికి మార్పు వచ్చిందని వైద్యులు వివరించారు.
This post was last modified on March 5, 2025 3:50 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…