జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పార్టీ కోసం, ఎన్నికల్లో జనసేన విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నాగబాబును ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చేసేందుకు సీఎం చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోతోన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు పేరును జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.
ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ ఆదేశించారు. అంతేకాదు, నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో, త్వరలోనే నాగబాబు ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
వాస్తవానికి నాగబాబును రాజ్యసభకు పంపుతారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీగా నాగబాబును పవన్ ఖరారు చేస్తారని టాక్ వచ్చింది. ఇక, ఇవన్నీ కాదు నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ పదవి ఇస్తారని ఇంకో పుకారు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి నాగబాబుకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఇక, అఫీషియల్ గా ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేయడంతో నాగబాబు శాసన మండలిలో అడుగుపెట్టడం ఖాయం అయింది. జనసేనకు ఉన్న సంఖ్యాబలం ప్రకారం నాగబాబు ఎంపిక లాంఛనమే.
This post was last modified on March 5, 2025 12:49 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…