Political News

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు… అధికారిక ప్రకటన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పార్టీ కోసం, ఎన్నికల్లో జనసేన విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నాగబాబును ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చేసేందుకు సీఎం చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోతోన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు పేరును జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.

ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ ఆదేశించారు. అంతేకాదు, నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో, త్వరలోనే నాగబాబు ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది.

వాస్తవానికి నాగబాబును రాజ్యసభకు పంపుతారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీగా నాగబాబును పవన్ ఖరారు చేస్తారని టాక్ వచ్చింది. ఇక, ఇవన్నీ కాదు నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ పదవి ఇస్తారని ఇంకో పుకారు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి నాగబాబుకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఇక, అఫీషియల్ గా ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేయడంతో నాగబాబు శాసన మండలిలో అడుగుపెట్టడం ఖాయం అయింది. జనసేనకు ఉన్న సంఖ్యాబలం ప్రకారం నాగబాబు ఎంపిక లాంఛనమే.

This post was last modified on March 5, 2025 12:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

19 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago